ఏసీబీ అదుపులో సీనియర్ అసిస్టెంట్ రాధిక

అదుపులోకి తీసుకున్న అధికారులు కరీంనగర్ (తెలంగాణ వాణి) కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రాధిక అక్రమ కమిషన్లు వసూలు చేసిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. కరీంనగర్ జిల్లా సంక్షేమ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న 44 ఏళ్ల మహిళా ఉద్యోగిని రాధికను మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ కరీంనగర్ రేంజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కాంట్రాక్టర్ల బిల్లుల […]

తెలంగాణ వాణి కథనానికి స్పందన – జంమ్గి బి లో నాలుగు లారీల జొన్నలు నింపిన అధికారులు సంగారెడ్డి, కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం ఉదయం తెలంగాణ వాణి పత్రికలో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న జొన్నలను వెంటనే తరలించాలని రైతులు కంగ్టి–పిట్లం ప్రధాన రహదారిపై […]
తడ్కల్ లో జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా

తడ్కల్ లో జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా కంగ్టి పిట్లం రోడ్డు పై బైఠాయించిన రైతన్నలు,నిలిచిన వాహనాలు సంగారెడ్డి,కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి ) సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో మంగళవారం జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతన్నలు కంగ్టి పిట్లం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు గోనే సంచుల,లారీల కొరతతో,అకాల వర్షానికి జొన్నలు […]
కొత్తగూడెం క్లబ్లో ఈ నెల 8న జరగనున్న “రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్” లాంచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : బీఆర్ఎస్ జిల్లా నాయకులు జయరాం
నిరుద్యోగ యువతకు నాణ్యమైన, ఉచిత పోటీ పరీక్షల శిక్షణ అందించాలనే లక్ష్యంతో కాంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో, Chakravarty E-Classroom భాగస్వామ్యంతో రూపొందించిన “Rakesh Reddy E-Classes App” లాంచ్ కార్యక్రమాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు జయరామ్ కోరారు.ఈ సందర్భంగా జయరామ్ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ సాధనకు నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని అన్నారు. అలాంటి సమయంలో నిరుద్యోగ యువతకు పూర్తిగా […]
జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు

జర్నలిస్టులపై ఇంటలిజెన్స్ పోలీసులతో విచారణ జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై మంత్రి పొంగులేటికి ఫిర్యాదు హైదరాబాద్ (తెలంగాణ వాణి) జర్నలిస్టులపై ఇంటలిజెన్స్ పోలీసులతో విచారణ చేయిస్తున్న జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ నేతృత్వంలో […]
పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ముస్లిం మైనారిటీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పర్హిన్ మేడంను సోమవారం చిన్నారి ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతి హరిత దీక్ష సభ్యుడు ఎం.డి. అఫాన్ జైదీ మర్యాదపూర్వకంగా కలిసి పచ్చని ఔషధ మొక్కలను అందజేశాడు. ఈ సందర్భంగా పర్హిన్ మేడం అఫాన్ జైదీకి ఆశీర్వాదాలు అందిస్తూ, ప్రకృతి పరిరక్షణ కోసం చేస్తున్న సేవలను అభినందించారు.రామవరం ఇఖ్రా ఆధునిక పాఠశాలలో చదువుతున్న అఫాన్ జైదీ, కె.ఎన్. రాజశేఖర్ స్ఫూర్తితో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో […]
సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ కాలనీ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని సిపిఐ సర్పంచ్ జర్పల దేవి, పంచాయతీ కార్యదర్శి చింతల ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాలతో పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చలమల సంధ్య, వార్డు సభ్యులు, లబ్ధిదారులు మిట్టపల్లి శిరీష, ధారావత్ స్రవంతి, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
రోడ్డెక్కిన అన్నదాతలు

తాలు, తప్ప పేరుతో తూకం పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటు ఆందోళన మల్లాపూర్ మే18,(తెలంగాణ వాణి) మండలంలోని ముత్యంపేటలోని వరి ధాన్యము కొనుగోలు కేంద్రాలలో తాళి తప్ప పేరుతో తూకం ఎక్కువ వేస్తున్నారని మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్ ఆధ్వర్యంలో రైతులతో ధర్నా చేపట్టాడు.ఈసందర్భంగా నాగేష్ మాట్లాడుతూ ముత్యంపేట,రాఘవపేట రెండు గ్రామాలలో సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలోని ధాన్యాన్ని కొనుగోలు చేయగా ముత్యంపేటలో మాత్రమే కిలో ధాన్యాన్ని తాళి తప్ప పేరుతో తూకం వేస్తున్నారని అన్నారు. […]
వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి

వైన్స్ ముందు శవాన్ని పెట్టి కుటుంబ సభ్యుల ధర్నా నారాయణఖేడ్/ పెద్ద శంకరంపేట్ మే:18 (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్ద శంకరంపేట పట్టణంలోని శంకరంపేట వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల అశోక్ (40) ఆదివారం సాయంత్రం శంకరంపేట వైన్స్ లో మందు తీసుకొని పర్మిట్ రూంలో మద్యం సేవించి అకస్మాత్తుగా మరణించడంతో […]
రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం…

రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం.. రెండు కోచ్లు దగ్ధం హైదరాబాద్ (తెలంగాణ వాణి) రాజస్థాన్లోని కోటా రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున రాజధాని ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక బోగీలో మొదలైన మంటలు.. క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న మరో బోగీలోకి కూడా వ్యాపించాయి. ప్రమాద సంకేతాన్ని సకాలంలో […]