UPDATES  

NEWS

 బహుముఖ ప్రజ్ఞాశాలి శారద ఇకలేరు….

బహుముఖ ప్రజ్ఞాశాలి శారద ఇకలేరు…

– సీనియర్ పాత్రికేయుడి మాతృమూర్తి మృతి…

వేములవాడ,జూన్ 11(తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) 

బహుముఖ ప్రజ్ఞాశాలి శారదమ్మ ఇకలేరు సికింద్రాబాద్ లోని గుండా ఈశ్వరయ్య పాఠశాలలో తన విద్యాభ్యాస్యాన్ని ప్రారంభించింది. వేములవాడ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె అలవోకగా వేలాది పద్యాలను చెప్పగలరు, శాస్త్రీయ సంగీతం లో ఆమెకు తెలియని రాగాలు, లయలు లేవు. ఆమె గొంతు లేత మావి చిగురు తిన్న కోకిల గానంలా ఉంటుంది. అమ్మ లేని లోటు మిత్రుడు గౌతమ్ బాబుకే కాదు మా అందరికీ లోటు.వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఇట్టేడు గౌతమ్ బాబు మాతృమూర్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇట్టేడు శారద(85) బుధవారం మృతి చెందారు. పట్టణంలోని వైకుంఠధామంలో ఆమె అంత్యక్రియలను వారి కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖుల మధ్యలో నిర్వహించారు. వేములవాడ పట్టణానికి చెందిన ప్రముఖులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్,పాత్రికేయులు, కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

Date of Publish : 11 June 2025, 10:07 pm Posted by : TELANGANA VANI

బహుముఖ ప్రజ్ఞాశాలి శారద ఇకలేరు….

బహుముఖ ప్రజ్ఞాశాలి శారద ఇకలేరు...
- సీనియర్ పాత్రికేయుడి మాతృమూర్తి మృతి...
వేములవాడ,జూన్ 11(తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) 

బహుముఖ ప్రజ్ఞాశాలి శారదమ్మ ఇకలేరు సికింద్రాబాద్ లోని గుండా ఈశ్వరయ్య పాఠశాలలో తన విద్యాభ్యాస్యాన్ని ప్రారంభించింది. వేములవాడ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె అలవోకగా వేలాది పద్యాలను చెప్పగలరు, శాస్త్రీయ సంగీతం లో ఆమెకు తెలియని రాగాలు, లయలు లేవు. ఆమె గొంతు లేత మావి చిగురు తిన్న కోకిల గానంలా ఉంటుంది. అమ్మ లేని లోటు మిత్రుడు గౌతమ్ బాబుకే కాదు మా అందరికీ లోటు.వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఇట్టేడు గౌతమ్ బాబు మాతృమూర్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇట్టేడు శారద(85) బుధవారం మృతి చెందారు. పట్టణంలోని వైకుంఠధామంలో ఆమె అంత్యక్రియలను వారి కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖుల మధ్యలో నిర్వహించారు. వేములవాడ పట్టణానికి చెందిన ప్రముఖులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్,పాత్రికేయులు, కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest