UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్

జనాభా గణన 2027 కార్యక్రమం సందర్భంగా ఏప్రిల్ 20 నుండి 25 వరకు నిర్వహించనున్న శిక్షణలో భాగంగా, మొదటి దఫా ఇండ్ల గణన మే 11 నుండి జూన్ 9 వరకు జరగనున్న నేపథ్యంలో పాల్వంచ మండల రూరల్ పరిధిలోని పాత ఆర్డిఓ కార్యాలయంలో సోమవారం ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని పాల్వంచ మండల తహసిల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ శిక్షణలో భాగంగా మొత్తం 36 మంది ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు.ముఖ్య అతిథిగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ […]

ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం…

ఎనిమిది మంది భక్తులను బలి తీసుకున్న రెడీమిక్స్ ట్యాంకర్. కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం. కర్నూల్ (తెలంగాణ వాణి) మంత్రాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం సమీపంలో భక్తులతో ప్రయాణిస్తున్న బోలేరో గూడ్స్ వాహనం ట్యాంకరు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది […]

వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

వేములవాడ,ఏప్రిల్ 14 (తెలంగాణ వాణి ప్రతినిధి) : వేములవాడ పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఉదయం నుంచే పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సందడి నెలకొంది. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, న్యాయవాదులు,సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మహానీయుడికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వేములవాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు,సీనియర్ న్యాయవాది గొంటి శంకర్, తెలంగాణ వాణి వేములవాడ నియోజకవర్గ ప్రతినిధి గొంటి గణేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా […]

సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్!

దశ వసంతంలోకి అడుగుపెట్టిన కళాశాల – ఘనంగా డీకేడిఎల్ టెక్నో ఫెస్ట్ వేడుకలు  సిద్దిపేట/​హుస్నాబాద్,ఏప్రిల్ 09 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రగతి పథంలో మరో మైలురాయిని అధిగమించింది. సివిల్ మరియు ఈఈఈ విభాగాలు విజయవంతంగా తొమ్మిది సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో ‘డీకేడిఎల్’ సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. ‘టెక్నిర్వాహణ’ మరియు ‘గ్రిడ్ స్టోము’ వంటి వినూత్న శీర్షికలతో […]

కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

జగిత్యాల (తెలంగాణ వాణి) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి గురువారం నాడు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువను కప్పుకున్నారు.తన అభిమానుల అభిప్రాయం మేరకు భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తానన్న జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏ పార్టీలో చేరేది స్పష్టంగా ప్రకటించని మాజీ మంత్రి జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడంతో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు జీవన్ రెడ్డి […]

హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్

కొత్తగూడెం కార్పొరేషన్ 52వ డివిజన్‌లో హ్యాండ్ బోర్ పనిచేయకపోవడంతో స్థానిక ప్రజలు డివిజన్ కార్పొరేటర్ కళావతి ధనరాజ్‌కు సమస్యను తెలియజేశారు.వెంటనే స్పందించిన కార్పొరేటర్ కళావతిధనరాజ్ ఉన్నతాధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన హ్యాండ్ బోర్‌ను మరమ్మతు చేయించారు.గెలిచిన నాటి నుంచి ప్రజలతోనే ఉంటూ, వారి సమస్యలను తనవిగా భావించి వెంటనే స్పందిస్తున్న కార్పొరేటర్‌కు డివిజన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది

మతి భ్రమించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు నాసిరకం పనుల వల్ల నాశనమైన పసివాడి జీవితం ములుగు జిల్లా బిఆర్ఎస్ మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి ములుగు (తెలంగాణ వాణి) పవిత్రమైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణంలో జరిగిన ఘోర ప్రమాదం చిన్నారి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన రమేష్ కుమారుడు యువన్ (6) గద్దె సమీపంలో ఆడుకుంటుండగా ఇటీవల నిర్మించిన రాతి దిమ్మలు ఆకస్మికంగా కూలి అతనిపై పడాయి. ఈ ఘటనలో బాలుడికి […]

అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్ 

వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని కోరిన తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్, ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.సాధారణ పాఠశాలల తరహాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఒంటిపూట బడి అమలు చేస్తూ, సమయాల్లో మార్పులు చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

GPW సికింద్రాబాద్ మరియు JNGPT రామంతాపూర్‌లో నిర్వహించిన సృజన టెక్ ఫెస్ట్ 2025–26 రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజేతలతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించి అభినందించారు.సివిల్ ఇంజినీరింగ్ విభాగం “స్మార్ట్ అండ్ సస్టైనబుల్ ఇన్నోవేషన్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్” అంశంపై మౌలిక వసతుల సమస్యలకు స్మార్ట్, స్థిరమైన పరిష్కారాలను ప్రదర్శించగా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం “స్మార్ట్ […]

ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

ప్రజానాయకుడు పొంగులేటి పై విషప్రచారమా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు నోరు అదుపులో పెట్టుకోక పోతే ఇళ్లను ముట్టడి చేస్తాం రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ కొత్తగూడెం (తెలంగాణ వాణి) వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 245 వ్యవసాయ భూమిలో జరుగుతున్న భూ వివాదానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డికి, వారి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేద‌ని, రాఘవ కన్స్ట్రక్షన్స్ కు తాము ఏలాంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయలేదని వ‌ట్టినాగుల‌ప‌ల్లి […]