శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోశాలలో గోవులకు సేవ
వేములవాడ, సెప్టెంబర్ 4 (తెలంగాణ వాణి): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేములవాడ గోశాలలో గోవులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు, 22వ వార్డు కౌన్సిలర్ ఇప్పపూల మమత–అజయ్తో పాటు సభ్యులు గోవులకు అరటి పండ్లు, పచ్చగడ్డిని తినిపించారు. ఈ సందర్భంగా మమత–అజయ్ మాట్లాడుతూ గోవులకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతమని, శ్రీకృష్ణుడికి ఇష్టమైన గోవులకు సేవ చేయడం కృష్ణ పరమాత్మునికి సేవ చేయడంతో సమానమని అన్నారు. కార్యక్రమంలో […]
తుక్కుగూడ ఘటన దుర్మార్గం.. శిరీష కుటుంబానికి అండగా నిలుస్తాం

న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం.. కల్పనా చౌదరి పాల్వంచ (తెలంగాణ వాణి) తుక్కుగూడలో జరిగిన ఘటన అత్యంత దుర్మార్గమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొల్లి ఫౌండేషన్ ప్రతినిధి కల్పనా చౌదరి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన ఊకె శిరీష కుటుంబాన్ని ఆమె పరామర్శించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కొల్లి ఫౌండేషన్ తరఫున శిరీష కుటుంబానికి ఆర్థిక సహాయం […]
మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష
పెద్దపల్లి, సెప్టెంబర్ 3 (తెలంగాణ వాణి జిల్లా ప్రతినిధి) మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఎలిగేడు మండలం రాములపల్లికి చెందిన తీట్ల నవదీప్ (22)కు పెద్దపల్లి పోక్సో కోర్టు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధించింది. 2025 ఏప్రిల్ 10న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాలిక తన తల్లికి విషయం తెలియజేయడంతో జూలపల్లి […]
మండల స్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు
తిమ్మాపూర్, సెప్టెంబరు 3 (తెలంగాణ వాణి ప్రతినిధి): మండల స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17 బాలబాలికలకు వివిధ క్రీడల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈవో వీ. శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబరు 7 నుంచి 9 వరకు ఎల్ఎండీ కాలనీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 7న బాలికలకు కబడ్డీ, కోకో, వాలీబాల్, 8న బాలురకు ఆయా క్రీడల్లో, 9న బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పాల్గొనే క్రీడాకారులు […]
అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీజేపీ ఆందోళన

తిమ్మాపూర్, సెప్టెంబర్ 3 (తెలంగాణవాణి ప్రతినిధి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ తిమ్మాపూర్ మండల బీజేపీ, దళిత మోర్చా ఆధ్వర్యంలో గురువారం తిమ్మాపూర్ స్టేజీ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి, రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు అప్రజాస్వామికమని నాయకులు ఆరోపించారు. రవీంద్రనాథ్ సంతదాస్పై నల్లరంగు చల్లిన ఘటనకు బాధ్యులైన కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేసి, […]
రచ్చపల్లిలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : -సర్పంచ్ సూర రజిత ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో గురువారం విద్యార్థులకు యూనిఫాం,షూ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ సూర రజిత హాజరై మాట్లాడుతూ.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, షూలు అందిస్తోందని అన్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ […]
ముగిసిన మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలు

ధర్మారం (తెలంగాణ వాణి ) ధర్మారం మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలు గురువారం నంది మేడారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా ముగిశాయి.ఈ ముగింపు కార్యక్రమానికి ధర్మారం మండల విద్యా వనరుల అధికారి (ఎంఈఓ ) పాఠశాల క్రీడల చైర్మన్ పి ప్రభాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి కె. లక్ష్మణ్, నంది మేడారం సర్పంచ్ వీరపాల్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయ, వార్డు సభ్యులు […]
విద్యుత్ సమస్యపై చైర్మన్ పుల్కం రాజు సత్వర స్పందన
విద్యుత్ సమస్యపై చైర్మన్ పుల్కం రాజు సత్వర స్పందన నిమిషాల్లో వెలిగిన సెంట్రల్ లైట్లు ఆది శ్రీనివాస్ సహకారంతో పట్టణ సుందరీకరణ సెంట్రల్ లైటింగ్ లో చిన్నపాటి లోపాలపై తక్షణ చర్యలు ప్రజల సహకారంతోనే వేములవాడ అభివృద్ది సాధ్యం సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు భరోసా వేములవాడ,సెప్టెంబర్ 02 (తెలంగాణ వాణి ప్రతినిధి) : వేములవాడ పట్టణ సుందరీకరణలో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థలో చిన్నపాటి […]
ఆస్ట్రేలియాలో క్రిటికల్ మినరల్స్ రంగంలోకి సింగరేణికి ఆహ్వానం

సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతితో మోనాష్ యూనివర్సిటీ బృందం భేటీ కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 31 (తెలంగాణ వాణి) కీలక ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆస్ట్రేలియా దేశంలో కలిసి పనిచేయడానికి ముందుకురావాలని ఆ దేశ ప్రముఖ పరిశోధన సంస్థ మోనాష్ యూనివర్సిటీ సింగరేణికి ఆహ్వానం పలికింది. మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం సోమవారం సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ద ప్రకాశ్ జ్యోతి తో సమావేశమై ఆస్ట్రేలియా దేశంలో క్రిటికల్ మినరల్స్ రంగంలో గల అవకాశాలను వివరించింది. […]
బిజెపి మండల కార్యాలయాన్ని ప్రారంభించిన పైడి ఎల్లారెడ్డి

ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు నీలం చిన్నరాజులు నాగిరెడ్డిపేట మండలం ఆగస్టు 30 (తెలంగాణ వాణి ప్రతినిధి) ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నూతన బిజెపి పార్టీ కార్యాలయాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు . ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు పాల్గొన్నారు . నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి మండల బిజెపి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని […]