UPDATES  

NEWS

మట్టి వినాయకుడిని పూజిద్దాం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదామని లయన్స్ క్లబ్ ధర్మారం అధ్యక్షుడు తలమక్కి రవీందర్ శెట్టి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎల్లారెడ్డి, ఎండి ముజాహిద్, కళ్లెం స్వామి రెడ్డి, ఎలగందుల అశోక్, సిహెచ్ నర్సింగం, సిహెచ్ శేఖర్, దయానంద్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెషనల్ హస్తకళాకారులు రాజస్థానీలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) వినాయక చవితి అంటేనే మనకు గుర్తుకు వచ్చేది రకరకాల ఆకృతిలొ కనిపించే గణనాథుల విగ్రహాలు… వాటిని తయారు చేయడంలో రాజస్థానీలకు ప్రత్యేకత ఉంది. కుటుంబ సభ్యులు, పిల్లలు సైతం విగ్రహాల తయారీలో నిమగ్నమైపోతారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గత మూడేళ్లుగా రాజస్థానీలు ఇక్కడ గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. వివిధ రకాల గణనాథుల విగ్రహలను ఆకర్షణీయంగా తయారు చేస్తు ఉపాధి పొందుతున్నారు. ధర్మారం చుట్టుపక్కల మండలాలకు చెందిన వందలాది […]

మాకు హైడ్రా కావాలంటున్న భద్రాద్రి జిల్లా ప్రజలు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) చెరువలను, కుంటలను కబ్జా చేసి విలాసవంతమైన భావనాలు నిర్మించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సీనియర్, సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్న రంగనాధ్ IPS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రా చేస్తున్న సంస్కరణలకు తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయ, ఆర్థిక పరపతితో చెరువులు కుంటలు కబ్జాలు చేస్తూ మా నిర్మాణాలు చేస్తున్న వారిపై ఎన్ని విధాలుగా ఫిర్యాదులు చేసిన వాళ్లకు భయపడి […]

ఒకేసారి టీ.పీసీసీ అధ్యక్షుడు, కొత్త మంత్రుల పేర్ల ప్రకటన

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. కొత్త సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం ఒకేసారి కొత్త అధ్యక్షుడి పేరుతో పాటు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి పేర్లను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్‌గా బీసీ నేతనే నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు లీకులు వెలువడ్డాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా […]

నాగార్జున “ఎన్” కన్వెన్షన్ కూల్చివేత…

హైడ్రా దృష్టిలో సినీ, రాజకీయ, బడబాబులు ఎవరైనా ఒక్కటే అంటున్న రంగనాధ్ హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతను నిర్వహిస్తున్నారు. […]

కవితతో ములాఖత్ కానున్న కేటీఆర్, హరీష్

న్యూఢిల్లీ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ అయి గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతీసారి కవితకు నిరాశానే ఎదురవుతోంది. మరోవైపు జైలులో ఉన్న కవిత బరువు తగ్గారని వార్తలు వినిపించాయి. అయితే నిన్న కవిత జైలులో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను జైలు అధికారులు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆరోగ్యం నిలకడ అయిన […]

డ్రైడే ఫ్రై డే కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

బెల్లంపల్లి (తెలంగాణ వాణి) డ్రై డే–ఫ్రై డే కార్యక్రమంలో భాగంగా హనుమాన్ బస్తి -28వ వార్డులో డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చేయించారు. ఇంటీంటికి వెళ్ళి ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలిగించాలని, పాత పాత్రలలో, టైర్ లలో నీరు నిల్వకుండా చూసుకోవాలని పరిసరాలు పరిశుబ్రముగా ఉంచుకోవాలని చూచనలు చేసి, జెసిబి తో పెద్ద కాలువలు తీయించి పిచ్చి మొక్కలు తొలిగించారు. ఈ కార్యక్రమముల చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, కమీషనర్ కె […]

అభిషేక్ శర్మ దూసుకుపోతున్న సన్ రైజర్స్ ప్లేయర్

సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక్‌ శర్మ ఐపీఎల్‌ 2024లో తన సత్తా చూపుతున్నాడు. ఓపెనర్‌గా వచ్ఛి మెరుపు వేగంతో బ్యాటింగ్లో ప్రతిభ కనబరుస్తున్నాడు.  శుక్రవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 37 పరుగులు చేయగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో 74 బంతులు ఎదుర్కొని 161 పరుగులు చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్న ఈ ప్లేయర్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని అభిమానుల నుంచి వాదనలు […]

రక్తపోటు పట్ల అప్రమత్తంగా వుండాలి

రక్తపోటు (బి.పి) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తత తో వుండాలని అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ.హేమంత్ పిలుపు నిచ్చారు. శుక్రవారం మే,17 “ప్రపంచ రక్తపోటు దినం” సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో సమాజంలో రక్తపోటు బాధితుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం, ఫాస్ట్ పుడ్స్ కారణంగా చిన్న వయసులోనే రక్తపోటుకు గురవుతున్నారన్నారు. 30 […]