UPDATES  

NEWS

ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడిని అభినందించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ రాష్ట్ర స్థాయిలో ఆణిముత్యంలా మెరిసిన నవ్య శ్రీ. జాతీయ స్థాయి పోటీలకు బయలుదేరిన వరంగల్ తైక్వాండో టీం ఐటీసీ నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన కొత్తగూడెం మండల విద్యాధికారి డా.యం.ప్రభు దయాల్. బడుగు,బలహీన వర్గాలు,మహిళల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డా. బి ఆర్. అంబేద్కర్: హెచ్.ఎం, బి. నామా నాయక్ గిరిజన ఇంజనీరింగ్ శాఖ పాల్వంచ లో ఘనముగా 134 వ అంబేద్కర్ జయంతి వేడుకలు. మొక్కలు నాటి వనజీవి రామయ్యకు ఘన నివాళులు సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టడం హర్షనీయం:సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్. పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణా వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను: కె ఎన్ రాజశేఖర్  పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత

 ఒకేసారి టీ.పీసీసీ అధ్యక్షుడు, కొత్త మంత్రుల పేర్ల ప్రకటన

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. కొత్త సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం ఒకేసారి కొత్త అధ్యక్షుడి పేరుతో పాటు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి పేర్లను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్‌గా బీసీ నేతనే నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు లీకులు వెలువడ్డాయి.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌ కుమార్ గౌడ్,  ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మాజీ ఎంపీ కేశవరావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ హోదాతో కూడిన అడ్వయిజర్ పోస్టులు ఇచ్చినందున నాలుగింటిని మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. సామాజికవర్గాల రీత్యా చూస్తే బీసీల్లో మున్నూరుకాపు, ముదిరాజ్‌, రజక, ఎస్సీ(మాల), ఎస్టీ (లంబాడా), రెడ్డి కులాలకు అవకాశం కల్పించాల్సి ఉంది. మరి ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest