కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి) కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం 7 బజార్ నందు రెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపం లో పాల్గొన్న మేయర్ మూడ్ గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండప నిర్వహకులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 2





