UPDATES  

టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి లను అరెస్టు చేయాలి : గాయత్రి బెహరా

గుంటూరు (తెలంగాణ వాణి కరస్పాండెంట్) స్థానిక అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి లపై ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్బంగా సొసైటీ వ్యవస్థాపక ఉపాధ్యక్షురాలు గాయత్రి బెహరా మాట్లాడుతూ తిరుమల తిరుపతి క్షేత్రానికి ప్రపంచంలోనే విశిష్ట గుర్తింపు ఉందని, తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమని అలాంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన తిరుపతి లడ్డు […]

ఢిల్లీకి గులాంగిరి చేయడం కోసమే రాజీవ్ విగ్రహ ఏర్పాటు : కొట్టి వెంకటేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహాం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టటం తెలంగాణ తల్లిని అవమానించడమేనని బిఆర్ఎస్ పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కకాంతారావు సూచనలతో రేవంత్ ప్రభుత్వం తీరుకు నిరసనగా పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి […]

ఢిల్లీ సీఎంగా అతిషి

తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్) రాజధాని ఢిల్లీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న సందేహం కలిగింది. ఈ క్రమంలో అతిషీ, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేర్లు వినిపించాయి. చివరకు మంత్రి అతిషీకి ముఖ్యమంత్రి […]

మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది “ఎర్రజెండా” నే

నిజాంకు వణుకు పుట్టించిన చర్రిత తెలంగాణ ప్రజలది సాయుధ పోరాట చరిత్ర దేశానికి దిక్చూచి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషా సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా సాయుధపోరాట దినోత్సవం కొత్తగూడెం (తెలంగాణ వాణి) మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది కమ్యూనిస్టుల ఎర్రజెండానేనని, కమ్యూనిస్టులతో మమేకమై నాటి మట్టిమనుషులు సాగించిన విరోచిన పోరాట ఫలితమే నేటి ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. 76వ తెలంగాణ సాయుధ రైతాంగ […]

కొత్త ఒరవడికి సీఎం నాంది ! నిమజ్జన వేడుకల్లో రేవంత్

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. మంగళవారం ఉదయమే మహాగణపతి శోభయాత్ర మొదలైంది. ఆ బొజ్జ గణపయ్య అడుగడుగునా భక్తుల పూజలందుకుంటూ ముందుకుసాగుతున్నాడు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో బడా గణేష్‌ శోభాయాత్ర సాగుతోంది. బడా గణేష్ ముందు చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ గణపయ్యను నిమజ్జనానికి తరలిస్తున్నారు. నిమజ్జనం కోసం బడా గణేష్ ఒడిఒడిగా హుస్సేన్ సాగర్‌వైపు వెళ్తున్నారు. ఇప్పటికే ఆ మహాగణపతి తెలుగు […]

జాతీయ జెండాకు అవమానం

తల్లకిందులుగా ఆవిష్కరించిన ఉపాధ్యాయులు జూలూరుపాడు (తెలంగాణ వాణి) జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం ఎంపిపిఎస్ పాఠశాలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను తల్లకిందులుగా ఆవిష్కరించారు. ఈ విషయాన్నీ ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ జెండాను సరిచేసే ప్రయత్నం చేయకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వారే జాతీయ జెండాకు అవమానం కల్గిస్తే సామాన్యులు పరిస్థితేమిటని వెంటనే జాతీయజెండా […]

హరీష్ రావు బృందాన్ని విడుదల చేసిన కేశంపేట పోలీసులు

హైదరాబాద్ (తెలంగాణ వాణి బ్యూరో) గత మూడు గంటలుగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి తదితరుల అరెస్టు సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ముందు జరుగుతున్న  ఆందోళన ఎట్టకేలకు ముగిసింది. మంత్రి హరీష్ రావు తదితర బృందాన్ని కెశంపేట పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత వదిలేశారు. దీంతో హరీష్ రావు తదితరులు తమ వాహనాల్లో వెళ్లిపోయారు. ఈ […]

ఎన్ఆర్ఎస్ కళాశాల గణేష్ నిమజ్జనం ఉత్సవాలు

కోదాడ (తెలంగాణ వాణి ప్రతినిది) కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించి విద్యార్థిని విద్యార్థులు భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శోభయాత్రలో విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో డాన్సులతో కోలాటాలాడుతూ వివిధ వేషధారణలో ప్రదర్శనలు చేస్తూ స్వామివారిని మట్టపల్లి పుణ్యక్షేత్రమైన నది వద్దకు నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, వైస్ ప్రిన్సిపాల్ […]

ప్రతి కార్మికుడు సభ్యత్వం నమోదు చేసుకోవాలి

హుజూర్ నగర్ (తెలంగాణ వాణి ప్రతినిది) భవన నిర్మాణ కార్మికుడు మేళ్లచెరువు సతీష్ మరణం చాలా బాధాకరమైన విషయమని ఎలక సోమయ్య గౌడ్ అన్నారు. కాగ సతీష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు వారికి పట్టణ కమిటీ సభ్యులు తరఫున భౌతిక దేహానికి పూలమాలవేసి సంతాపం తెలియజేశారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. సతీష్ అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం కలిగిన మనిషి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, […]

ఎస్సై యుగంధర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ ఎంపీపీ, మార్కెట్ వైస్ చైర్మన్

వనపర్తి/పెద్దమందడి (తెలంగాణ వాణి) వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని నూతన ఎస్సై యుగంధర్ రెడ్డిని మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, వనపర్తి మార్కెట్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సదా అందుబాటులో ఉండి అమూల్యమైన సేవలు అందించాలని, పోలీస్ బృందానికి మండల ప్రజలు అందరం సహకరించాలన్నారు. వారితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు గట్టు యాదవ్, అల్వాల మాజీ ఉపసర్పంచ్ సుదర్శన్ రెడ్డి, […]