UPDATES  

NEWS

రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రుల బృందాన్ని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి సందర్భంగా చివరి సందేశం ఎప్పుడైనా దీన్ని చదవారా గ్రామసభలో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్ దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ ఎంపీ ఆర్ఆర్ఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సలహా మండలి సభ్యులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ రోడ్డు పక్కన బడ్డీ కొట్టులో టీ తాగిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ సాంస్కృతిక సారధికి మెమోరాండం

 టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి లను అరెస్టు చేయాలి : గాయత్రి బెహరా

గుంటూరు (తెలంగాణ వాణి కరస్పాండెంట్)

స్థానిక అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి లపై ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్బంగా సొసైటీ వ్యవస్థాపక ఉపాధ్యక్షురాలు గాయత్రి బెహరా మాట్లాడుతూ తిరుమల తిరుపతి క్షేత్రానికి ప్రపంచంలోనే విశిష్ట గుర్తింపు ఉందని, తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమని అలాంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన తిరుపతి లడ్డు హిందువులకు అత్యంత పవిత్రమైనదని అలాంటి తిరుపతి లడ్డుకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె అవశేషాలు ఉండడం చాలా బాధాకరమన్నారు. ఈ విషయం కోట్లాది హిందువుల మనోభావాలు మరియు మత విశ్వాసాలను దెబ్బతీసే విషయమని దీనికి బాధ్యులుగా అప్పటి టీటీడీ చైర్మన్, ఈవో లను వెంటనే అరెస్టు చేసి విచారణ జరిపి దీని వెనక ఎవరున్నారు, వీరి కుట్ర ఏమిటో ప్రభుత్వం బయట పెట్టాలని అలాగే మిగిలిన పెద్ద దేవాలయాలైన శ్రీశైలం, సింహాచలం, అన్నవరం మొదలగు పెద్ద దేవాలయాల్లోని ప్రసాదాలకు వాడుతున్న నెయ్యిని కూడా ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేయాలని పేర్కొన్నారు.

మొదటినుండి జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణి అవలంబించడం వల్లనే నేడు ఘోర పరాభవం చవి చూడాల్సి వచ్చిందని దేవాలయాల మీద దాడులు చేసి విగ్రహాలు ధ్వంసం చేస్తే రధాలు తగలబెడితే పెట్టిన వారిని పట్టుకుని శిక్షించాల్సింది పోయి వాటి మీద ఉద్యమం చేసిన హిందూ నాయకులను జైల్లోకి పంపించిన ఘన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెల్లుతుందని అలాగే ఆయన ప్రభుత్వంలో ఇంత దారుణం టిటిడిలో జరిగిందని వెలికి తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో సరిపెట్టకుండా దీని మీద నిజనిర్ధారణ కమిటీ వేయాలని దానిలో స్వామీజీలు హిందూ సంఘాలను సభ్యులను చేయాలని దాని ద్వారా విచారణ సవ్యంగా జరుగుతుందని వారు చేసిన దారుణాలు బయటకు వస్తాయని అలాగే ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అలాగే రాజకీయ నాయకులు ఒక విషయం గుర్తుంచుకోవాలని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి జోలికి వచ్చిన వారికి ఏ గతులు పెట్టాయో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు అనిల్ బెహరా, చింతపల్లి మల్లికార్జున్ శర్మ, భిక్షవాచారి పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest