UPDATES  

NEWS

ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

 జాతీయ జెండాకు అవమానం

తల్లకిందులుగా ఆవిష్కరించిన ఉపాధ్యాయులు
జూలూరుపాడు (తెలంగాణ వాణి)

జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం ఎంపిపిఎస్ పాఠశాలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను తల్లకిందులుగా ఆవిష్కరించారు. ఈ విషయాన్నీ ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ జెండాను సరిచేసే ప్రయత్నం చేయకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వారే జాతీయ జెండాకు అవమానం కల్గిస్తే సామాన్యులు పరిస్థితేమిటని వెంటనే జాతీయజెండా తల్లకిందులుగా ఆవిష్కరించిన ఉపాధ్యాయుల పై పలువురు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారత దేశానికి ఎందరో మహాత్ముల ప్రాణ త్యాగాలతో సంపాదించుకున్న స్వాతంత్ర చిహ్నాన్ని విద్యా వంతులైన ఉండి తల కిందులుగా ఆవిష్కరించడం విమర్శకు కారణమైంది. బాధ్యత గల విద్యావంతులు జెండా ఆవిష్కరణలో నిర్లక్ష్యం వహించడం భారత దేశానికే అవమానమని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest