UPDATES  

NEWS

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులని మర్యాదా పూర్వకముగా కలిసిన జాతీయ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.మధుకర్. తెలంగాణ వాణి పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ దేశ వ్యాప్తంగా రక్త దాతలను అందిస్తున్న జె బి బాలు అభినందనీయులు ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు పుట్టిన రోజు ఓ మొక్కను బహుమతిగా ఇవ్వండి: ప్రకృతి ప్రేమికుడు కళ్యాణ్ యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యం.బాలు నాయక్ పుట్టిన రోజు మొక్కను నాటిన కె ఎన్ రాజశేఖర్ పదో తరగతి ఫలితాల్లో రేలకాయలపల్లి ప్రభంజనం..సమిష్టి కృషితోనే 100% ఫలితాలు: హెచ్ ఎం శ్రీనివాసరావు నాయక్ పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు  పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు.

 ప్రతి కార్మికుడు సభ్యత్వం నమోదు చేసుకోవాలి

హుజూర్ నగర్ (తెలంగాణ వాణి ప్రతినిది)

భవన నిర్మాణ కార్మికుడు మేళ్లచెరువు సతీష్ మరణం చాలా బాధాకరమైన విషయమని ఎలక సోమయ్య గౌడ్ అన్నారు. కాగ సతీష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు వారికి పట్టణ కమిటీ సభ్యులు తరఫున భౌతిక దేహానికి పూలమాలవేసి సంతాపం తెలియజేశారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. సతీష్ అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం కలిగిన మనిషి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఎందరో కార్మికులు కార్డు రెన్యువల్ చేయించుకోకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారని నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు సభ్యత్వ నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డులు ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామని అనడం చాలా బాధాకరం అలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా సోమయ్య గౌడ్ తెలియజేశారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్ లు వెంటనే పరిష్కరించాలని కార్మిక నిధులను విడుదల చేయాలని రాబోయే రోజుల్లో కార్మిక సమస్యలపై పోరాటానికి కార్మికులంతా సిద్ధం కావాలని అని తెలియజేశారు. సతీష్ కి కార్మికుల తరఫున జోహార్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest