మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు

హైదరాబాద్, మే 12 (తెలంగాణ వాణి) మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అజ్ఞాతం వీడారు. భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన నక్సల్స్ విధానాలకు ఆకర్షితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ కారణంగా ఉద్యమం వైపు వచ్చారు. తర్వాతి కాలంలో అడవి బాట పట్టారు. మావోయిస్టు అగ్రనేతగా […]
గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్
భద్రాచలం మే 10:మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతతో కూడిన ఆధునిక పద్ధతులను అవలంబించి గిరిజనాభివృద్ధి కోసం నాణ్యతతో కూడిన మెరుగైన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేస్తామని గిరిజన శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాణ్యత పరమైన నిర్మాణ పనుల్లో ఎలాంటి రాజీ లేకుండా సేవలు అందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఇంజనీర్ల కొరత ఉన్న నేపథ్యంలో […]
10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు

3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు భద్రాచలం (తెలంగాణ వాణి) అటవీ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా భద్రాచలం ఎఫ్డీవో సుజాత, చర్ల ఇంచార్జ్ డీఆర్వో కృష్ణయ్యలను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. సమాచారం ప్రకారం చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రహదారి నిర్మాణ పనుల సమయంలో కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు […]
కరీంనగర్లో ఉద్రిక్తత

బిజెపి వర్సెస్ బిఆర్ఎస్ గంగుల క్యాంప్ ఆఫీసుపై బీజేపీ శ్రేణుల దాడి..! కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం పోలీసుల తీరుపై మండిపడ్డ వద్దిరాజు రవిచంద్ర కరీంనగర్ (తెలంగాణ వాణి) కరీంనగర్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. కేటీఆర్ పై బండి సంజయ్ చేసిన కామెంట్స్ ను ఖండిస్తూ…. బీఆర్ఎస్ నేతలు కూడా సవాళ్లు విసిరారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి […]
కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్లో దోపిడీ
కరీంనగర్ నగర నడిబొడ్డున పట్టపగలే సాయుధ దోపిడీ జరగడం తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కరీంనగర్ : మే 03 (తెలంగాణ వాణి ప్రతినిధి) ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు కస్టమర్ల ముసుగులో షోరూమ్లోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లిన వెంటనే ఆయుధాలు బయటకు తీసి సిబ్బందిని బెదిరించారు. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు […]
మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్
యువత సమగ్ర అభివృద్ధి, క్రీడా రంగ ప్రోత్సాహం లక్ష్యంగా యువజన సర్వీసులు అండ్ క్రీడల రూపొందించిన “99 రోజుల కార్యాచరణ ప్రణాళిక” పోస్టర్ను జిల్లా కలెక్టర్ అంకిత్ ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సిపిఓ సంజీవరావు, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మే 5 నుండి మే 12 వరకు జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ […]
మండలంలో జెడ్పీ హెచ్ ఎస్ లక్ష్మీదేవిపల్లి పాఠశాలదే ఆగ్రస్థానం
నేడు విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలోని 5 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీదేవిపల్లి పాఠశాల 92 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. ఈ పాఠశాలకు చెందిన షేక్ ఆశ్ర 494/600 మార్కులు సాధించి ప్రథమ స్థానం దక్కించుకోగా, గోపికా సాహితీ 492/600 మార్కులతో ద్వితీయ స్థానం పొందింది. విద్యార్థులు సాధించిన ప్రతిభపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చిన్న రామ్మూర్తి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
కవితక్క కొత్త పార్టీ పేరు TRS

పార్టీ పేరు TRS (తెలంగాణ రాష్ట్ర సేన) ప్రకటించిన కవిత అప్పటి టీఆర్ఎస్ కోసం రక్తం , చెమట ధార పోశా కాళేశ్వరంలో అవినీతి జరిగింది నిజం అది చెప్పినందుకు నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టారు బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదు పార్టీ ఆవిర్భావ సభలో కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ […]
జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్
జనాభా గణన 2027 కార్యక్రమం సందర్భంగా ఏప్రిల్ 20 నుండి 25 వరకు నిర్వహించనున్న శిక్షణలో భాగంగా, మొదటి దఫా ఇండ్ల గణన మే 11 నుండి జూన్ 9 వరకు జరగనున్న నేపథ్యంలో పాల్వంచ మండల రూరల్ పరిధిలోని పాత ఆర్డిఓ కార్యాలయంలో సోమవారం ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని పాల్వంచ మండల తహసిల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ శిక్షణలో భాగంగా మొత్తం 36 మంది ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు.ముఖ్య అతిథిగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ […]
ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం…

ఎనిమిది మంది భక్తులను బలి తీసుకున్న రెడీమిక్స్ ట్యాంకర్. కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం. కర్నూల్ (తెలంగాణ వాణి) మంత్రాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం సమీపంలో భక్తులతో ప్రయాణిస్తున్న బోలేరో గూడ్స్ వాహనం ట్యాంకరు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది […]