ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొల్లి నందయ్యను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షునిగా నియమిస్తూ ఆ సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు లంక సదయ్య శనివారం పెద్దపల్లిలో నియామక పత్రాన్ని నందయ్యకు అందించారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాలలో అంబేద్కర్ సంఘం కమిటీలు వేసి సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నందయ్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో మండల అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన జాతీయ, రాష్ట్ర, మండల శాఖ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర కార్యదర్శి పాల రాజేశం, సీనియర్ నాయకులు పెరుక బానేష్, ఆరుముల్ల బాపు తదితరులు పాల్గొన్నారు.



