ధర్మారం తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో గురువారం నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి విశ్వకర్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున విశ్వకర్మలకు అన్ని విధాల సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ధర్మారం మండల అధ్యక్షుడు వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు శ్యాంసుందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రూప్ల నాయక్, పలువురు సర్పంచ్ లు పాల్గొన్నారు.





