UPDATES  

NEWS

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులని మర్యాదా పూర్వకముగా కలిసిన జాతీయ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.మధుకర్. తెలంగాణ వాణి పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ దేశ వ్యాప్తంగా రక్త దాతలను అందిస్తున్న జె బి బాలు అభినందనీయులు ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు పుట్టిన రోజు ఓ మొక్కను బహుమతిగా ఇవ్వండి: ప్రకృతి ప్రేమికుడు కళ్యాణ్ యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యం.బాలు నాయక్ పుట్టిన రోజు మొక్కను నాటిన కె ఎన్ రాజశేఖర్ పదో తరగతి ఫలితాల్లో రేలకాయలపల్లి ప్రభంజనం..సమిష్టి కృషితోనే 100% ఫలితాలు: హెచ్ ఎం శ్రీనివాసరావు నాయక్ పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు  పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు.

 ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య

హైదరాబాద్ / పటాన్ చెరువు (తెలంగాణ వాణి ప్రతినిది)

గుమ్మడిదల్ మండలంలో బీహార్ నుండి బతుకు తెరువు కోసం దోమడుగు గ్రామంలో రాజ్ కుమార్ భార్య గీతాదేవి ముగ్గురు కొడుకులుతో కలిసి ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేసుకుంటూ గత రెండు సంవత్సరాల జీవనం సాగిస్తున్నారు. అయితే పెద్ద కుమారుడు అంకిత్ కుమార్ వాళ్ల సొంత గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో పెద్దలు నిరాకరించారు. విషయం తెలుసుకున్న అంకిత్ బీహార్ కు వెళ్లి తరచూ అమ్మాయిని కలుస్తుండడంతో , అబ్బాయిని అమ్మాయి తల్లిదండ్రులు రెడ్ హ్యాండుగా పట్టుకున్నారు. మరోసారి ఇలా జరిగితే పోలీస్ లకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. కాగ విషయం తెలుసుకున్న అంకిత్ కుమార్ తల్లిదండ్రులు వెంటనే బీహార్ కి వెళ్లి కొడుకుకి సర్ది చెప్పి తిరిగి ఇంటికి తీసుకురావడం జరిగింది. తదననంతరం అమ్మాయి దగ్గరనుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మనస్థాపానికి గురైన అంకిత్ కుమార్ సాయంత్రం సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి తల్లిదండ్రులను ఏం జరిగిందో కనుక్కొని దర్యాప్తు ప్రారంభించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest