కొత్తగూడెం (తెలంగాణ వాణి)
ఈ నెల 19 నుండి 20 వరకు 2 రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న కొత్తగూడెం క్రీడాకారులు 4 బంగారు పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు పతకాలతో సత్కరించి అదేవిధంగా జాతీయస్థాయిలో కూడా మన జిల్లాకు మంచి పేరు తేవాలని అభినందనలు తెలిపారు. కొత్తగూడెం కు చెందిన ఏ వందన డిస్కస్ త్రో, హెపటాదిలిన్ లో రెండు బంగారు పథకాలు,
సిహెచ్.వేదశ్రీ కిడ్స్ జావలింగ్ త్రో ట్రయాత్లను లో రెండు బంగారు పతకాలు, జే.దీక్షిత్ షాట్ పుట్ లో బంగారు పతకాలు సాధించడం జరిగింది. పతకాలు సాధించిన క్రీడాకారులను, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ కే సారంగపాణి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రెటరీ మహిధర్, సిపిఐ పార్టీ చుంచుపల్లి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, జాతీయ క్రీడాకారులు చుంచుపల్లి మండలం సిపిఐ పార్టీ కౌన్సిల్ మెంబెర్ ఎండీ . బాబ్జి, కొత్తగూడెం అథ్లెటిక్స్ కోచ్ దుంపల మల్లికార్జునరావు, సుష్మ భాయ్, జాతీయ క్రీడాకారులు వంశీ, మాన్విత క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు