ఎన్ఆర్ఎస్ కళాశాల గణేష్ నిమజ్జనం ఉత్సవాలు

కోదాడ (తెలంగాణ వాణి ప్రతినిది) కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించి విద్యార్థిని విద్యార్థులు భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శోభయాత్రలో విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో డాన్సులతో కోలాటాలాడుతూ వివిధ వేషధారణలో ప్రదర్శనలు చేస్తూ స్వామివారిని మట్టపల్లి పుణ్యక్షేత్రమైన నది వద్దకు నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, వైస్ ప్రిన్సిపాల్ […]
ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య

హైదరాబాద్ / పటాన్ చెరువు (తెలంగాణ వాణి ప్రతినిది) గుమ్మడిదల్ మండలంలో బీహార్ నుండి బతుకు తెరువు కోసం దోమడుగు గ్రామంలో రాజ్ కుమార్ భార్య గీతాదేవి ముగ్గురు కొడుకులుతో కలిసి ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేసుకుంటూ గత రెండు సంవత్సరాల జీవనం సాగిస్తున్నారు. అయితే పెద్ద కుమారుడు అంకిత్ కుమార్ వాళ్ల సొంత గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో పెద్దలు నిరాకరించారు. విషయం తెలుసుకున్న అంకిత్ బీహార్ కు వెళ్లి తరచూ అమ్మాయిని కలుస్తుండడంతో , […]
ప్రతి కార్మికుడు సభ్యత్వం నమోదు చేసుకోవాలి

హుజూర్ నగర్ (తెలంగాణ వాణి ప్రతినిది) భవన నిర్మాణ కార్మికుడు మేళ్లచెరువు సతీష్ మరణం చాలా బాధాకరమైన విషయమని ఎలక సోమయ్య గౌడ్ అన్నారు. కాగ సతీష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు వారికి పట్టణ కమిటీ సభ్యులు తరఫున భౌతిక దేహానికి పూలమాలవేసి సంతాపం తెలియజేశారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. సతీష్ అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం కలిగిన మనిషి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, […]
జగిత్యాల జైత్రయాత్రకు 46 ఏళ్లు

తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్) తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు సంబంధించిన ప్రస్తావన వస్తే ‘జగిత్యాల జైత్రయాత్ర’ గుర్తుకు తెచ్చుకోవల్సిందే. ఈ ప్రాంతంలో విప్లవోద్యమాలకు ఆ జైత్రయాత్రే నాంది పలికింది. ఎలాంటి సమా చార వ్యవస్థలు అందుబాటులో లేని కాలంలో, కేవలం మాటల ద్వారా విషయం తెలుసుకొని లక్షలాది మంది ఒకే చోటుకు చేరిన రోజు సరిగ్గా 46 ఏళ్ల క్రితం 1978 సెప్టెంబర్ 9న రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ చరిత్రలో […]
ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేసిన ప్రముఖ వ్యాపార వేత్త

బిచ్కుంద/కామారెడ్డి (తెలంగాణ వాణి ప్రతినిధి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపార వేత్త బండయప్ప పటేల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను బిచ్కుంద మఠాధిపతి శ్రీ శ్రీశ్రీ 108 సోమలింగా శివాచార్య స్వామిజీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మఠాధిపతి స్వామిజీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి పంపిణీ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బండయప్ప పటేల్, సిద్దు […]
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి కోటి పారితోషకం, గ్రూప్-2 ఉద్యోగం

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో అద్భుతం చేసిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అథ్లెట్ దీప్తి జీవాంజి పారాలింపిక్స్ లో పాల్గొని కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. ఇటీవల ఒలింపిక్స్ తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవేదికపై సత్తాచాటే అథ్లెట్లు, ఆటగాళ్లను కచ్చితంగా గౌరవిస్తాం, వారు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ తెలంగాణ […]
మట్టి వినాయకుడిని పూజిద్దాం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదామని లయన్స్ క్లబ్ ధర్మారం అధ్యక్షుడు తలమక్కి రవీందర్ శెట్టి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎల్లారెడ్డి, ఎండి ముజాహిద్, కళ్లెం స్వామి రెడ్డి, ఎలగందుల అశోక్, సిహెచ్ నర్సింగం, సిహెచ్ శేఖర్, దయానంద్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెషనల్ హస్తకళాకారులు రాజస్థానీలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) వినాయక చవితి అంటేనే మనకు గుర్తుకు వచ్చేది రకరకాల ఆకృతిలొ కనిపించే గణనాథుల విగ్రహాలు… వాటిని తయారు చేయడంలో రాజస్థానీలకు ప్రత్యేకత ఉంది. కుటుంబ సభ్యులు, పిల్లలు సైతం విగ్రహాల తయారీలో నిమగ్నమైపోతారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గత మూడేళ్లుగా రాజస్థానీలు ఇక్కడ గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. వివిధ రకాల గణనాథుల విగ్రహలను ఆకర్షణీయంగా తయారు చేస్తు ఉపాధి పొందుతున్నారు. ధర్మారం చుట్టుపక్కల మండలాలకు చెందిన వందలాది […]
మాకు హైడ్రా కావాలంటున్న భద్రాద్రి జిల్లా ప్రజలు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) చెరువలను, కుంటలను కబ్జా చేసి విలాసవంతమైన భావనాలు నిర్మించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సీనియర్, సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్న రంగనాధ్ IPS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రా చేస్తున్న సంస్కరణలకు తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయ, ఆర్థిక పరపతితో చెరువులు కుంటలు కబ్జాలు చేస్తూ మా నిర్మాణాలు చేస్తున్న వారిపై ఎన్ని విధాలుగా ఫిర్యాదులు చేసిన వాళ్లకు భయపడి […]
ఒకేసారి టీ.పీసీసీ అధ్యక్షుడు, కొత్త మంత్రుల పేర్ల ప్రకటన

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. కొత్త సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం ఒకేసారి కొత్త అధ్యక్షుడి పేరుతో పాటు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి పేర్లను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్గా బీసీ నేతనే నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు లీకులు వెలువడ్డాయి. వర్కింగ్ ప్రెసిడెంట్గా […]