UPDATES  

NEWS

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే కూనంనేని

కొత్తగూడెం (తెలంగాణ వాణి) రాజ్యసభ సభ్యుడుగా ఇటీవలే ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వేం నరేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు తేవడంతో, ప్రజల సమస్యలను రాజ్యసభ ద్వారా పరిష్కరించేందుకు వేం నరేందర్ రెడ్డి సేవలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ […]

కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు

కేజీబీవీ, యుఆర్ఎస్ సిబ్బంది మరియు సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్. నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షుడు బి. రామ్ చంద్, ప్రధాన కార్యదర్శి ఎం. పుల్లయ్య ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొంటూ మహిళా ఉద్యోగులకు బేసిక్ పే, ఉద్యోగ-ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈనెల 16న జిల్లా కేంద్రాల్లో, 20న ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామని […]

చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారంలో మంగళవారం చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రు కుమారులు బి.వీరన్న,బి.రవి తమ తండ్రి చంద్రు జ్ఞాపకార్థం పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు సామగ్రిని విద్యార్థులకు అందించారు. హెచ్ ఎం జి.నాగరాజు మాట్లాడుతూ..నాలుగేళ్లుగా సుమారు 300 మంది గిరిజన విద్యార్థులకు సామాగ్రి అందించడం అభినందనీయమన్నారు.బి.రవి మాట్లాడుతూ..మార్చి 14 నుంచి జరిగే వార్షిక పరీక్షలకు భయం లేకుండా సిద్ధం కావాలని సూచించారు.ఈ సందర్భంగా బి.శారదా బాయి ఎస్జిటి […]

బండపల్లిలో విద్యుత్ సెగకు నిరుపేద ఇల్లు బుగ్గి: సర్వం కోల్పోయి వీధిన పడ్డ కుటుంబం

బండపల్లి, మార్చి 09 (తెలంగాణ వాణి ప్రతి నిధి):   రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఒక సామాన్య కుటుంబం తమ గూడును, అందులోని సర్వస్వాన్ని కోల్పోయింది. ప్రమాద వివరాల్లోకి వెళ్తే… గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీకి చెందిన మంజాల శేఖర్ (తండ్రి లక్ష్మయ్య నాగేశ్వరరావు) నివాసంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. స్థానికులు మంటలను […]

కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన

పాల్వంచ లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దశల వారీ ఆందోళనలో భాగంగా మొదటి దశ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శనలో కేజీబీవీ ఉపాధ్యాయులతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి ఎస్.కే.యాకూబ్ పాషా, మండల అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి జి.హరి సింగ్,జిల్లా సోషల్ మీడియా సభ్యుడు బి.మంగీలాల్ నాయక్ తదితరులు […]

త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతులకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

కొత్తగూడెం లీగల్: త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతికి కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సోమవారం తీర్పు చెప్పారు .కేసు వివరాలు ఇలా…. భద్రాచలం కు చెందిన తోట వెంకటరమణ(57) 2020- 01- 01 తేదీన పా మీలేరు విహారయాత్రకు కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెళ్లి సాయంత్రం ఐదున్నరకు తిరిగి వస్తుండగా బూర్గంపాడు దాటిన తర్వాత […]

కూలీలైన్ మసీదు యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కూలీలైన్ మసీదు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉపవాస దీక్షలు ముగించిన అనంతరం ప్రార్థనలు నిర్వహించి, సామూహికంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సోదరభావం,ఐక్యతను ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.కార్యక్రమంలో మోమిత్,జుబ్బు,అబ్బు, టాపిక్,మున్నా,షోయబ్, సైద్, యాసీన్ పాషా, సోను, అఖిల్, సమీర్,అలీమ్, సోహెబ్ తదితరులు పాల్గొన్నారు.

టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

పాల్వంచ, మార్చి 08: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పాల్వంచ మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల ఉపాధ్యక్షులు పీ. సత్యశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గా భవాని ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా సాధికారతపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. మురళీమోహన్, మల్లెంపాటి వెంకటేశ్వర్లు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మలత, […]

మహిళా దినోత్సవం .. రోజు మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహాన్

మహిళా దినోత్సవం పురస్కరించుకొని మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహన్.కొత్తగూడెం కార్పొరేషన్ 19వ డివిజన్ కార్పొరేటర్, ప్రముఖ వైద్యురాలు స్వప్న కు మొక్క బహూకరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అవసరమని సందేశం ఇస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఇన్ని రంగాలలో రాణిస్తున్నారని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.

ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ విద్యార్థుల ఐఎన్‌టీఎస్ఓ ఒలింపియాడ్ పరీక్షలు విద్యార్థుల ప్రతిభ..

స్థానిక ఎన్టీఆర్ సర్కిల్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్‌టీఎస్ఓ ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహించగా, విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు మరియు నమూనాలను ప్రదర్శించి తమ సృజనాత్మకతను చాటుకున్నారు.శాస్త్ర విజ్ఞానం నిత్యజీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం చేతన్ మాధుర్, కోఆర్డినేటర్ కృష్ణారావు, ప్రిన్సిపాల్ నివేదిత, వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్, డీన్ గంగరాజు, […]