UPDATES  

NEWS

తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్

దీక్షిత అసోసియేషన్ మేనేజర్ బి.శ్రీనివాస్ కు మొక్కలు వితరణ చేసిన ప్రకృతి ప్రేమికుడు ఏటీఈసీ జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని దీక్షిత అసోసియేషన్ మేనేజర్ బి.శ్రీనివాస్ నివాసంలో మొక్కలను అందించిన ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్. అనంతరం దీక్షిత, రోహిత్ చిన్నారులు మిత్ర బృందం కలిసి మొక్కలు నాటారు. ఇప్పటికీ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధి మరో కోణంలో చూపిస్తాను :సర్పంచ్ అభ్యర్థి తారాచంద్

టేకులపల్లి మండలం జి కొత్త తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తారాచంద్ పోటీ చేస్తున్నారు.అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా…మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవకు కృషి చేస్తానని కార్యకర్తలతో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు.మీరందరూ పెద్ద మనసు చేసుకొని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని భారీ ర్యాలీ నిర్వహించి,ప్రజలకు సేవ చేసే అవకాశం ఓటర్ల దేవుళ్ళు అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఖీమా లాల్, వీరభద్రం,శ్రీను,నరేష్, […]

బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాభివృద్ధి : మద్దెల సుధీర్

కొత్తగూడెం (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి పల్లె ప్రగతికి బాటలు వేసిందని మద్దెల సుధీర్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం చుంచుపల్లి మండలం మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తో కలిసి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి గ్రామాల అభివృద్ధి కోసం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పేద […]

ఆదరించండి.. అభివృద్ధి చేస్తా : వజ్జా ఈశ్వరి

ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఐ పార్టీ సర్పంచి అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఐ పార్టీ సర్పంచి అభ్యర్థి   లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) చాతకొండ గ్రామ ప్రజలు తనని ఆదరించి ఉంగరం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే చాతకొండ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సిపిఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వజ్జా ఈశ్వరి అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆశీస్సులతో గ్రామానికి అధిక నిధులు తీసుకొచ్చి గ్రామంలో గత పాలకవర్గం చేయని, మిగిలిన పనులను పూర్తి చేసి […]

భూసమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే ఓటు

డబ్బులు వద్దు.. అభివృద్ధికే మా ఓటు లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) మూడో విడత స్థానిక ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మిదేవిపల్లి మండలంలోని మైలారం గ్రామ ప్రజలు తమకు డబ్బు వద్దని అభివృద్ధి కావాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు డబ్బులు, మద్యం వద్దని ఎన్నో ఏళ్లుగా తమ భూ సమస్యకు పరిష్కారం దొరకడంలేదని, తమ పంట పొలాలను ముంపు ప్రాంత భూములుగా పరిగణించి రెవిన్యూ రికార్డుల్లోకి ఎక్కించారని కానీ తమ […]

అవకాశం ఇవ్వండి రుణం తీర్చుకుంటా

రాజకీయ గురువుల ఆశీస్సులతోనే పోటీ బిఆర్ఎస్ బలపరిచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తాళ్ల సుధారాణి తల్లాడ (తెలంగాణ వాణి) మండలంలో గోపాల పేట గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయతోనే రాజకీయంగా అడుగులు వేశానని. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి. తెలంగాణ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్, ఆశీస్సులతోనే . గోపాల్ పేట కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కాంగ్రెస్ అభ్యర్థి తాళ్ల సుధారాణి అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ కాంగ్రెస్ బలపర్చిన […]

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు.

పాల్వంచ మండలం జగన్నాథ పురం పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బండారి నీరజ రమేష్ దంపతుల కుమార్తె ఓణీల శుభకార్యానికి హాజరై ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం,(యుపిఎ) నాయకులు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్, సంఘం వ్యవస్థాపకురాలు గోపికా రత్నాకర్ దంపతులు,ఎ టి ఈ సి జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు,యుపిఎ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజు మోహన్,బెస్త భాస్కర్,కోదండపాణి,రాజు తదితరులు పాల్గొన్నారు

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) చాతకొండ పంచాయతీలోని బీసీ కాలనీలో ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహబూబ్ జానీ ఇంట్లో జరిగిన గ్యార్వి షరీఫ్ ఉత్సవాల్లో సిపిఐ నాయకురాలు, చాతకొండ సర్పంచ్ అభ్యర్థి వజ్జా ఈశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం అని, అందరూ సామరస్యంగా జరుపుకునే వేడుక అని అన్నారు. ఎంతో పవిత్రంగా కొలిచే గ్యార్వి షరీఫ్ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. సర్వ […]

మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి

వీణవంక (తెలంగాణ వాణి) కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శనిగరపు మల్లయ్య (70) హఠాన్మరణం చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, ఆదివారం మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుడి కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సంధి సమ్మిరెడీ, కర్ణకంటి శంకర్ రెడ్డి, మేకల వేణు తదితరులు పాల్గొన్నారు.

ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో

చాతకొండ సర్పంచ్ అభ్యర్థిగా వజ్జా ఈశ్వరి లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మిదేవిపల్లి మండలం, చాతకొండ గ్రామానికి చెందిన వజ్జా ఈశ్వరి ఆశ కార్యకర్త ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచింది. ఉమ్మడి చాతకొండ పంచాయతీ మొట్టమొదటి సర్పంచ్ గా పనిచేసిన స్వర్గీయ మాజీ సర్పంచ్ వజ్జా సీతారాములు భార్య గా అందరికి సుపరిచితురాలైన వజ్జా ఈశ్వరి భర్త బాటలో ప్రజా సేవ చేసేందుకు పంచాయతీ బరిలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఆశా […]