UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్

విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్’ (యువికా–26)కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఈ కార్యక్రమం శాస్త్ర, సాంకేతిక,ఇంజనీరింగ్,గణిత రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మంచి వేదికగా నిలుస్తోంది.ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.ఎంపికలో 8వ తరగతి మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు క్విజ్‌లు,విజ్ఞాన సదస్సులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, గ్రామీణ విద్యార్థులకు వెయిటేజ్ మార్కులు కేటాయిస్తారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31 […]

భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం

భద్రాచలం డివిజన్ లో పిఆర్టియు టి ఎస్ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు దశమ బాబు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ హాజరై మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కలిసి జిల్లాలో సంఘ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.అలాగే జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు దనికొండ శ్రీనివాసరావు,దశమ బాబు,మంగయ్య,నాగులు జిల్లా శాఖకు పలు సూచనలు, సలహాలు […]

మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య

లక్ష్మీదేవి పల్లి మండలం మండల స్థాయి బాలమేళా పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఎంఈఓ పి కృష్ణయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ స్థాయి బాల మేళాలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.వివిధ నైపుణ్యాల ను సృజనాత్మకతను ప్రదర్శించారు.అనంతరం విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఇఓ కృష్ణయ్య తో పాటు కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, కాంప్లెక్స్ సెక్రటరీలు మరియు మండలంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయుని, ఉపాద్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ

కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుజాతనగర్ 21 వ డివిజన్ పరిధిలో గల గొల్లగూడెం గ్రామానికి చెందిన చైతన్య హమాలి ముఠా మెస్త్రి వీర్ల మల్లేశ్వర రావు,సరస్వతి ల ఏకైక కూమార్తె  లక్ష్మీ ప్రసన్న వివాహ వేడుక సందర్భంగా  కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరించి నూతన వధువుకు  ఆశీర్వాదం అందజేసారు.ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు,భద్రాద్రి జిల్లా సీపీఎం పార్టీ […]

హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది

లక్ష్మీదేవి పల్లి మండలం లక్ష్మీదేవి పల్లి పంచాయతీ సిబ్బంది హోలీ పండుగను సంబరంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా (ఏ టి ఈ సి) అలయెన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బాలునాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పల్లి పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు పర్యవేక్షించే పుష్ప రాజ్, సీనియర్ పంచాయతీ డ్రైవర్ సింగ్,లింగయ్య,శివ,నాగరాజు, మహాలక్ష్మి,చక్రవర్తి జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు

కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు మరియు పట్టణ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా మూడు దశల పోరాటం చేపట్టాలని నిర్ణయించినట్లు టీఎస్‌ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు తెలిపారు.కేజీబీవీ, యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో […]

రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా !

హనుమకొండ:మార్చి03 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) హనుమకొండలోని జిల్లా ఇండోర్ స్టేడియం రంగుల లోకమైంది. నిత్యం కఠినమైన శిక్షణతో, క్రమశిక్షణతో కూడిన మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే తైక్వాండో విద్యార్థులు మంగళవారం హోలీ పండుగను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. ప్రతిరోజూ లాగే ఉదయం స్టేడియంలో తమ కోచ్,స్నేహ ఆధ్వర్యంలో కఠినమైన ప్రాక్టీస్ పూర్తి చేసిన విద్యార్థులు, అనంతరం ఒక్కసారిగా పండుగ వాతావరణంలోకి మారిపోయారు.సాధన సమయంలో ప్రదర్శించే గంభీరత్వాన్ని పక్కన పెట్టి,చిన్నా పెద్దా తేడా లేకుండా […]

నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి నందు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి,పూల బోకేతో స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి ఎస్కే పాషా,పాల్వంచ మండల […]

సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్

గిరిజన లంబాడీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (GLS JAC) ఆధ్వర్యంలో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. GLS JAC చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా ఎదురుగడ్డ వరకు లంబాడీ సంస్కృతి, సంప్రదాయ నృత్యాల నడుమ భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగడ్డలో మహా భోగ్ భండారో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి […]

పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ

టేకులపల్లి మండలం ఏహెచ్‌ఎస్ గంగారం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా సేవలందించిన పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా ఆయన స్వగృహంలో సన్మానం చేసిన పిఆర్.టి.యు.టిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పి. నరసయ్య. జిల్లా మరియు మండల స్థాయి సంఘ నాయకులు కూడా పాల్గొని పి డి చేసిన విద్యా సేవలను కొనియాడారు. విద్యార్థుల అభ్యున్నతికి ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత ఆదర్శప్రాయమని నాయకులు పేర్కొన్నారు..కార్యక్రమంలో జిల్లా,మండల సంఘ నాయకులు పాల్గొన్నారు.