కుండపోత వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
కుండపోత వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలోనే వానలు పడుతున్న పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాలు తడిసిముద్దవుతున్నాయి. గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట […]
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..
దంచికొడుతున్న వాన..రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..ఉత్తర తెలంగాణలో కుండపోత పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..ప్రాజెక్టులకు వరద పోటు ఎల్లంపల్లికి 74,643 క్యూసెక్కులు,జూరాలకు 32,500 క్యూసెక్కుల వరద ఇటు ఎల్లంపల్లి, అటు జూరాల నుంచి ఎత్తిపోతలు షురూ నేడు కూడా అతిభారీ వర్షాలుంటాయన్న ఐఎండీ.. ఆరెంజ్ అలర్ట్ జారీ రాష్ట్రంలో వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఓ మోస్తరుగా మొదలైన చినుకులు.. […]
రేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్..
రేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్..రెండ్రోజులే టైమ్..ఈ పని చేయకపోతే కార్డు కట్.. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్. రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ పూర్తి చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కార్డు ఇనాక్టివ్ అయిపోవడం వల్ల రేషన్ సరుకులు తీసుకోలేరు. ఇ-కేవైసీ(e-KYC) ధృవీకరణను పూర్తి చేయడానికి ఈ నెల 31వ తేదీ వరకు రేవంత్ సర్కార్ […]
వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం
వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం వేములవాడ,జూలై 30 (తెలంగాణ వాణి ప్రతినిధి) : రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న మూడు రోజుల వరుణ యాగంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రులు వేములవాడలోని భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ […]
ఉచిత డయాబెటిస్ పరీక్షలు నిర్వహించిన లయన్స్ క్లబ్

75 మందికి పరీక్షలు.. 20 మందికి షుగర్ నిర్ధారణ – మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మల్లన్నగుట్ట సమీపంలోని క్రీడా తెలంగాణ ప్రాంగణంలో ఆదివారం ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ (షుగర్) నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు చింతపండు నర్సింగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వాకర్స్ అసోసియేషన్కు చెందిన 75 మందికి షుగర్ పరీక్షలు నిర్వహించగా, వారిలో […]
జన్మదినం….జనహితానికి అంకితం….!
జన్మదినం…జనహితానికి అంకితం…! రోగులకు చేయూత…ప్రకృతికి తోడుగా… సేవా సందేశం చాటిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా వేములవాడ,జూలై 25 (తెలంగాణ వాణి ప్రతినిధి) : నేటి సమాజంలో జన్మదినం అంటే కేక్ కటింగ్లు, పూల బొకేలు, శుభాకాంక్షల సందడి అనే భావన బలపడుతున్న వేళ,ఆ వేడుకకు సామాజిక బాధ్యతను జోడించి ఆదర్శంగా నిలిచారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా.తన జన్మదినాన్ని […]
కమలాపూర్లో తెలంగాణ వాణి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు
కమలాపూర్లో తెలంగాణ వాణి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు యువత డ్రగ్స్ కి బానిస కావద్దు – సీ.ఐ. నవీన్ యాదవ్ డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయి – ఎడిటర్ జెరిపోతుల సంపత్ యువత భవిష్యత్ కి పునాదులు వెయ్యాలి – ఎస్ఐ మధు మత్తు వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి – సైకాలజిస్ట్ బైరి నరేష్ కమలాపూర్, జూలై 24 (తెలంగాణ వాణి) : సమాజాన్ని నిశ్శబ్దంగా కబళిస్తున్న ముప్పు ఏదైనా ఉందంటే […]
ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్య సంస్థలు బంద్
ధర్మారం (తెలంగాణ వాణి)రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థల బందుకు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపత్యంలో ఏఐఎస్ఎఫ్, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్మారం మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలను విద్యార్థి సంఘాల నాయకులు బంద్ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులను నిరసిస్తూ విద్యావ్యవస్థకు సంబంధించిన పలు డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై […]
కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన బారాస శ్రేణులు

ధర్మారం (తెలంగాణ వాణి) మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగే భారీ రైతు సదస్సుకు వెళ్తున్న మాజీ మంత్రి బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సోమవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో భరాస శ్రేణులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు గజమాలవేసి పూలు చల్లి కెసిఆర్, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు ఉత్సాహం చూపించారు. మహిళా నాయకురాళ్లు కేటీఆర్ కు నుదుట తిలకం దిద్దేందుకు పోటి పడ్డారు. కేటీఆర్ రాకకు ముందు […]
జనసేన తెలంగాణ లీగల్ సెల్ సభ్యుల రాష్ట్రస్థాయి సమావేశం
జనసేన తెలంగాణ లీగల్ సెల్ సభ్యుల రాష్ట్రస్థాయి సమావేశం శనివారం హైదరాబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. జనసేనలో న్యాయవాదులకు అత్యంత గౌరవం ఉంటుందని, నవంబర్ నెలలో వెయ్యి మంది న్యాయవాదులతో సమావేశం నిర్వహిస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ ప్రకటించారు.జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారిని ఈ సమావేశంకు ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.ఈ సమావేశంలో జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి […]