UPDATES  

NEWS

వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ

 తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్ధినులకు సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారని వారి తల్లిదండ్రులు మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ కి ఫోన్ చేసి సమస్యలను వివరించగా వెంటనే అక్కడికి చేరుకున్నారు. విద్యాలయంలోని వంట గది మరియు విద్యార్థులు త్రాగే నీరు, తినే ఆహారాన్ని పరిశీలించారు. విద్యాలయంలో ప్రస్తుత దుర్బర పరిస్థితిని మరియు విద్యార్థినిలు తినే ఆహారం వారు వారి అవసరాలకు నిమిత్తం వాడే కలుషితరమైన నీటిని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యమంత్రి & విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడని అన్నారు. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్ గెలిచాక అమెరికాలో తప్ప ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని సోషల్ మీడియాలో ఫోజులకు తప్ప నియోజకవర్గంలోని విద్యాసంస్థలపై అవగాహన లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి నియోజకవర్గం లోని అన్ని గురుకుల పాఠశాలలో పర్యటించి వారి సమస్యలను తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. లేని పక్షాన కలెక్టరేట్ ముట్టడి చేస్తామని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest