UPDATES  

NEWS

రచ్చపల్లిలో ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు

 ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల కూల్చివేత

ఆక్రమణదారులు ఎంతటి వారైనా చర్యలు : తహశీల్దార్ శ్రీనివాస్

 

ధర్మారం: జనవరి10 (తెలంగాణ వాణి విలేఖకరి)

ధర్మారం మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కి చెందిన భూమిలో అక్రమంగా రైస్ మిల్ నిర్మించిన కట్టడాన్ని శనివారం ధర్మారం తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూల్చివేసారు. మండల కేంద్రంలో పెద్దపల్లి హైవేను ఆనుకుని ఉన్న ప్రభుత్వ సర్వేనెంబర్ 297లో మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి దాదాపు 3గుంటల మేర భూమిని ఆక్రమించి అందులో రైస్ మిల్ నిర్మించినట్లు తహశీల్దార్ తెలిపారు. 298 సర్వే నెంబర్లో పట్టా ఉండి సర్వే నెంబర్ 297లో ప్రభుత్వ భూమిని ఆక్రమించినందున కూల్చివేయడం జరిగిందని, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడుతామన్నారు. స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఎస్సారెస్పీ డీఈ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపల్లి ఏడి సర్వే నిర్వహించి ఆక్రమిత భూమిలో రైస్ మిల్ షెడ్ నిర్మించినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు తహశీల్దార్ డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కూల్చివేత లో ఆర్ ఐ నవీన్ రావు, మండల సర్వేయర్ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ కూడిక్యాల రవి లు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest