UPDATES  

NEWS

ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం

 ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల కూల్చివేత

ఆక్రమణదారులు ఎంతటి వారైనా చర్యలు : తహశీల్దార్ శ్రీనివాస్

 

ధర్మారం: జనవరి10 (తెలంగాణ వాణి విలేఖకరి)

ధర్మారం మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కి చెందిన భూమిలో అక్రమంగా రైస్ మిల్ నిర్మించిన కట్టడాన్ని శనివారం ధర్మారం తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూల్చివేసారు. మండల కేంద్రంలో పెద్దపల్లి హైవేను ఆనుకుని ఉన్న ప్రభుత్వ సర్వేనెంబర్ 297లో మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి దాదాపు 3గుంటల మేర భూమిని ఆక్రమించి అందులో రైస్ మిల్ నిర్మించినట్లు తహశీల్దార్ తెలిపారు. 298 సర్వే నెంబర్లో పట్టా ఉండి సర్వే నెంబర్ 297లో ప్రభుత్వ భూమిని ఆక్రమించినందున కూల్చివేయడం జరిగిందని, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడుతామన్నారు. స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఎస్సారెస్పీ డీఈ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపల్లి ఏడి సర్వే నిర్వహించి ఆక్రమిత భూమిలో రైస్ మిల్ షెడ్ నిర్మించినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు తహశీల్దార్ డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కూల్చివేత లో ఆర్ ఐ నవీన్ రావు, మండల సర్వేయర్ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ కూడిక్యాల రవి లు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest