భారీ వర్షాల నేపథ్యంలో సిబ్బందికి సూచనలు…
నగరంలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్ ఆగస్టు 28:(తెలంగాణ వాణి ప్రతినిధి) నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు మునిసిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జి , గౌతమ్ నగర్ బైపాస్, జునైరా హోటల్, బోధన్ రోడ్, న్యూ బ్రిడ్జి సమీపంలోని సాగర్ హిల్స్ వివిధ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. […]
గణనాథులను తరలించడంలో చిన్నారులు……
ప్రమాదకరమని తెలిసినా ఎలా పంపిస్తారు ధర్మారం: ఆగస్టు 27 (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి విగ్రహాలను ధర్మారం మండల కేంద్రం నుండి ఆయా గ్రామాలకు తరలించే క్రమములో ట్రాక్టర్లు, టాటా ఏసీలు, ఆటోలలో 7,8 సంవత్సరాల వయస్సున్న బాలలు పాల్గొని ఘననాధులను తరలిస్తున్నారు. ఇందులో పిల్లలు పాల్గొనడం ఎంత ప్రమాదకరమో తల్లిదండ్రులు గమనించాలి. ప్రతి గణపతి తరలింపులో పదేళ్లు కూడా నిండని పిల్లలు ఇలలు ఊదుతూ, […]
బిఆర్ఎస్ నేత పుట్టినరోజు హడావుడి

పాల్వంచలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు, కటౌట్ అనుమతులున్నాయా? కార్పొరేషన్ కమిషనర్ మౌనం ఎందుకు పాల్వంచ పోలీసులకు పట్టింపు లేదా పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, అడుగడుగునా కటౌట్లు బిఆర్ఎస్ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ పట్టణంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్ లు చూసి ప్రజలు ఇదేం చోద్యం అంటున్నారు. ఇష్టారీతిన ఫ్లెక్సీలను పెడుతున్నప్పటికి కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటంటు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ బిఆర్ఎస్ నాయకులతో లోపాయకారి ఒప్పందం ఏమైనా చేసుకున్నారేమో […]
చిన్న వానకే చెరువును తలపిస్తున్నా సర్వారం కంకరమిల్లు రోడ్డు
సుజాత నగర్ మండలం సర్వారం కంకరమిల్లు నుండి గోప తండా,నర్సింహ సాగర్,సింగభూపాలెం పోయే రోడ్డు చిన్న వానకే చెరువును తలపిస్తుంది.ఈ మార్గం నుండే అనేక మంది రైతులు తమ పడి పంటలను పట్టణాలకు ఈ మార్గం నుండి రవాణా చేస్తుంటారు.చదువుకొనే విద్యార్థులు, డ్యూటీకి వెళ్లే ఉద్యోగులు,వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు,అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
లోడిగా అఖిల్ జ్ఞాపకార్థంగా మిత్ర బృందం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం
సంతోష్ నగర్ నందు గల మణుగూరు శ్రీవిద్య స్కూల్ లో లోడిగా అఖిల్ జ్ఞాపకార్థం ఆయన స్నేహితుల ఆధ్వర్యంలో అఖిల్ తల్లిదండ్రులు లోడిగా రామారావు జయమ్మ చేతుల మీదుగా మహా అన్నదానం చేశారు.అదేవిధంగా విద్యార్థుల కు స్కూల్ వైట్ డ్రెస్ అందజేశారు.ఈ సందర్భంగా గెజిటెడ్ హెడ్మాస్టర్ లోడిగా రామారావు మాట్లాడుతూ సమాజంలో మంచి గౌరవం పొందాలంటే విద్యా ద్వారానే సాధ్యమని, విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో సంతోష్,హరీష్,అభిషేక్, పి.హరీష్,ప్రసాద్,శశి ప్రీతం,గగన్,భరత్,కౌశిక్,వికాస్, ఇశాంత్,సాయి,ప్రకాష్ ప్రణీత్,జయంత్,అఖిల్ […]
ఉత్తమ ఫారెస్ట్ ఉద్యోగిగా ప్రశంసా పత్రం అందుకున్న మాళోత్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన 79వ స్వాతంత్ర వేడుకలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి,జిల్లా కలెక్టర్,మరియు జిల్లా అటవీ శాఖ అధికారి చేతుల మీదుగా ఉత్తమ ఫారెస్ట్ ఉద్యోగిగా మాళోత్ ప్రసాద్ అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా సర్వారం గ్రామ ఉద్యోగులు, స్థానిక ప్రజలు,యువకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యదర్శి, సహాయ కార్యదర్శుల ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యదర్శి,సహాయ కార్యదర్శుల ఎన్నిక.. వేములవాడ,తెలంగాణ వాణి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వేములవాడ నియోజకవర్గం స్థాయి నూతన కార్యదర్శి, సహాయ కార్యదర్శుల ఎన్నిక బుధవారం రోజున స్థానిక పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేశారు. వేములవాడ యూనియన్ అధ్యక్షులు తొగరి కరుణాకర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. నూతన కార్యదర్శిగా నందగిరి చంద్రశేఖర్, సహాయ కార్యదర్శులుగా నిమ్మశెట్టి రాజు, మోటం సంజీవ్ లను సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా […]
పుస్తక పాఠకులకు గ్రంధాలయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్
పుస్తక పాఠకులకు గ్రంధాలయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం మొక్కలు నాటిన భద్రాద్రి జిల్లా సింగరేణియన్ మన్ కీ బాత్ ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్.పుస్తకాలలో జ్ఞానమును అందించుటకై భారత దేశంలో గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్ ఎస్ ఆర్.రంగనాథన్ జయంతి సందర్భంగా ఆయన మారేడు మొక్కను నాటి గ్రంథాలయ అధికారులకు, సిబ్బందికి మరియు పాఠకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ ను అభినందించిన ట్రాఫిక్ పోలీస్ ధారవత్ చందా నాయక్
భావితరాలకు స్వచ్ఛమైన నీరు,గాలి,ఆహారం లభించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయులు బాలు నాయక్ అన్నారు.స్వచ్ఛ మైన,ఆహ్లాదరకమైన వాతావరణం కోసం,ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు,వర్షాలు పడేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని ట్రాఫిక్ కానిస్టేబుల్ చందా నాయక్ పేర్కొన్నారు.విరివిగా మొక్కలు నాటుతూ మరియు పలువురికి మొక్కలు పంపిణీ చేస్తున్నా బాలు నాయక్ ను ఆయన అభినందించారు.
తీజ్ పండుగ” సందర్భంగా మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు వర ప్రసాద్
“తీజ్ పండుగ” సందర్భంగా బంజారా సోదర సోదరీ మణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకృతి హరిత దీక్షుడు భూక్య వరప్రసాద్ తన మిత్రుడు భూక్య గణేష్ తో కలిసి ముత్యాలంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒక మునగ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని కోరుతూ…మన్ కీ బాత్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చే ప్రశంసించబడిన సింగరేణియన్,భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్,ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ ఈ సందర్భంగా […]