UPDATES  

NEWS

రచ్చపల్లిలో ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు

 ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పోచయ్యకు సన్మానం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) మండలంలోని కొత్తూరు గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం కు బల్బులు ఏర్పాటు చేయించిన స్థానిక గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంపల్లి పోచయ్య ను శ్రీ మహాశక్తి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భవాని అమ్మ వారి మండపంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. గత కొంతకాలంగా సెంట్రల్ లైటింగ్ సిస్టం లైట్లు పనిచేయకపోవడంతో ఇట్టి విషయాన్ని కమిటీ సభ్యులు అయినా కాంపల్లి పోచయ్య దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ధర్మారం ఎంపీడీవో గ్రామ ప్రత్యేక అధికారి అయినాల ప్రవీణ్ కుమార్, సెక్రటరీ మల్లేశంతో మాట్లాడి వారి సహకారంతో నూతన సెంట్రల్ లైటింగ్ సిస్టంకు బల్బులు ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మహాశక్తి ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest