UPDATES  

 ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పోచయ్యకు సన్మానం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) మండలంలోని కొత్తూరు గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం కు బల్బులు ఏర్పాటు చేయించిన స్థానిక గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంపల్లి పోచయ్య ను శ్రీ మహాశక్తి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భవాని అమ్మ వారి మండపంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. గత కొంతకాలంగా సెంట్రల్ లైటింగ్ సిస్టం లైట్లు పనిచేయకపోవడంతో ఇట్టి విషయాన్ని కమిటీ సభ్యులు అయినా కాంపల్లి పోచయ్య దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ధర్మారం ఎంపీడీవో గ్రామ ప్రత్యేక అధికారి అయినాల ప్రవీణ్ కుమార్, సెక్రటరీ మల్లేశంతో మాట్లాడి వారి సహకారంతో నూతన సెంట్రల్ లైటింగ్ సిస్టంకు బల్బులు ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మహాశక్తి ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest