UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మధుకర్ సుడిగాలి పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. మధుకర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. రాహుల్ ఐఎఎస్ ఆదేశాల మేరకు గిరిజన అభివృద్ధి పనులను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు.ఒకే రోజులో కిన్నెరసాని గురుకుల పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ హోదాలో కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ను సందర్శించి హెచ్‌ఎం,ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని, మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు.ఇక భద్రాచలం గిరి మార్ట్ను శ్రీరామనవమి కంటే ముందే ప్రారంభించేందుకు ఈఈ బృందం కసరత్తు చేస్తోంది. షెడ్ నిర్మాణం,మరమ్మతులు, పెయింటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.తదుపరి కామేపల్లి మండలంలో రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించారు.అలాగే ఖమ్మం జిల్లా కేంద్రంలోని మహిళా మార్ట్ ఖమ్మంను సందర్శించి గిరి మార్ట్ నిర్వహణపై సలహాలు తీసుకున్నారు.భద్రాచలం గిరి మార్ట్‌ను మహిళా మార్ట్‌గా అభివృద్ధి చేసి విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మధుకర్ సుడిగాలి పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. మధుకర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. రాహుల్ ఐఎఎస్ ఆదేశాల మేరకు గిరిజన అభివృద్ధి పనులను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు.ఒకే రోజులో కిన్నెరసాని గురుకుల పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ హోదాలో కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ను సందర్శించి హెచ్‌ఎం,ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని, మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు.ఇక భద్రాచలం గిరి మార్ట్ను శ్రీరామనవమి కంటే ముందే ప్రారంభించేందుకు ఈఈ బృందం కసరత్తు చేస్తోంది. షెడ్ నిర్మాణం,మరమ్మతులు, పెయింటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.తదుపరి కామేపల్లి మండలంలో రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించారు.అలాగే ఖమ్మం జిల్లా కేంద్రంలోని మహిళా మార్ట్ ఖమ్మంను సందర్శించి గిరి మార్ట్ నిర్వహణపై సలహాలు తీసుకున్నారు.భద్రాచలం గిరి మార్ట్‌ను మహిళా మార్ట్‌గా అభివృద్ధి చేసి విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest