UPDATES  

NEWS

 కవిత దీక్షకు మద్దతు తెలిపిన బిరుదురాజు వెంకటేశ్వర రాజు

హైదరాబాద్/కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఖమ్మంలో దీక్ష చేపట్టిన కవితను పోలీసులు బలవంతంగా హైదరాబాద్ తరలించిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలోనే ఆమె తన దీక్ష కొనసాగిస్తున్నారు. వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం జరిగి కూల్చిన ఇళ్ల స్థానంలోనే కొత్త నివాసాలు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేంత వరకూ తన నిరాహార దీక్ష కొనసాగుతుందని ఆమె స్పష్టంచేశారు. కాగా నేడు 3వ రోజు దీక్షను కొనసాగిస్తున్న కవిత ను కలిసిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ బిరుదురాజు వెంకటేశ్వర రాజు ఆమె దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వెలుగుమాట్ల బాధితులకు అండగ నిలిచిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికి తెలుసని నేడు అర్హులైన పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ స్కీమ్ అందిచడమనేది కవిత సాధించిన విజయమన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest