UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 ప్రతి కార్మికుడు సభ్యత్వం నమోదు చేసుకోవాలి

హుజూర్ నగర్ (తెలంగాణ వాణి ప్రతినిది)

భవన నిర్మాణ కార్మికుడు మేళ్లచెరువు సతీష్ మరణం చాలా బాధాకరమైన విషయమని ఎలక సోమయ్య గౌడ్ అన్నారు. కాగ సతీష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు వారికి పట్టణ కమిటీ సభ్యులు తరఫున భౌతిక దేహానికి పూలమాలవేసి సంతాపం తెలియజేశారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. సతీష్ అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం కలిగిన మనిషి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఎందరో కార్మికులు కార్డు రెన్యువల్ చేయించుకోకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారని నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు సభ్యత్వ నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డులు ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామని అనడం చాలా బాధాకరం అలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా సోమయ్య గౌడ్ తెలియజేశారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్ లు వెంటనే పరిష్కరించాలని కార్మిక నిధులను విడుదల చేయాలని రాబోయే రోజుల్లో కార్మిక సమస్యలపై పోరాటానికి కార్మికులంతా సిద్ధం కావాలని అని తెలియజేశారు. సతీష్ కి కార్మికుల తరఫున జోహార్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest