UPDATES  

NEWS

కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు…. వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

 ఒక్కసారిగా పెరిగిన గోదావరి వరద ఉధృతి

గోదావరిలో చిక్కుకున్న ఇసుక కార్మికులు
కొట్టుకుపోయిన ట్రాక్టర్లు
జగిత్యాల/మల్లాపూర్:అక్టోబర్ 21(తెలంగాణ వాణి)

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో ఒక్కసారిగా గోదావరికి వరద ఉదృతికి ట్రాక్టర్ లో ఇసుక నింపుతున్న కార్మికులు చిక్కుకుపోయారు. గోదావరి వరద నీరు ఎక్కువ రావడంతో నదిలో ఇరుక్కుపోయిన ట్రాక్టర్ వదిలేసిన డ్రైవర్ లేబర్ తో కలిసి ఒడ్డుకు చేరాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో గోదావరి నీటి ఉదృతి పెరగటంతో ఇసుక తీసుకురావటానికి వెళ్లిన వారు గోదావరిలో చిక్కుకుకున్నారు. వాల్గొండ శివారు లోని గోదావరిలో ఇసుక తీసుకు రావటానికి పలువురు లేబర్లు, డ్రైవర్ ట్రాక్టర్ తీసుకుని వెళ్లారు. ఇసుక నింపుతుండగా ఒక్కసారిగా గోదావరి నీటి ఉదృతి పెరిగింది, గోదావరి మద్యలో ఉన్నవాళ్లు చాకచక్యంగా ఈత ఈదుతూ అతి కష్టంమీద ఒడ్డుకు చేరుకున్నారు. ఇసుక తీసుకు రావడానికి వెళ్లిన ట్రాక్టర్ గోదావరిలో మునిగి పోయింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest