UPDATES  

NEWS

బంద్ విజయవంతం చేయండి బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు మృతుడి కుటుంబానికి మామిడి స్వామిరెడ్డి చేయూత పశువులను తరలిస్తున్న కంటేనైర్ పట్టివేత తెలుగు వెలుగు సాహితీ వేదిక అవార్డు అందుకున్న షేక్ మాయ మస్తాన్ వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు 

 అన్ని శాఖల సమన్వయంతో విజయవంతముగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

డిఐఈఓ ను అభినందన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి)

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినందుకు డీ ఐ ఈ వో తిరుమల పూడి రవికుమార్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో డిఐఈఓ తో పాటు ఇంటర్ బోర్డు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు.2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ఇంటర్ విద్య అధికారితో పాటు పరీక్షల నిర్వహణ కమిటీని అభినందించారు. అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అంద చేశారు కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి తిరుమలపుడి రవికుమార్, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియోదిన్, అస్లాం, హై పవర్ కమిటీ శ్రీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లా పరీక్షల విభాగంకు విద్యుత్ శాఖ, ఆర్టీసీ, ఆరోగ్యశాఖ, పోస్టల్, శాఖ, పోలీస్ శాఖ మున్సిపల్, గ్రామ పంచాయతీ, విభాగాలు సహకరంతో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.అలాగే అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఎప్పటికప్పుడు తమకు సహకరిస్తూ అన్ని విభాగాలను సమన్వయం చేసి తమను ఇంటర్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేందుకు ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest