UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 హర్ష టౌన్షిప్‌లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్‌ లకు ఘన సన్మానం

పాల్వంచ మండలం హర్ష టౌన్షిప్ లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ అధ్యక్షతన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ చౌహన్ మరియు 31వ డివిజన్ కార్పొరేటర్ నునావత్ శ్యామల దినేష్‌లకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం బానోత్ రాములు నాయక్ స్వగృహంలో జరిగింది.ఈ సందర్భంగా టౌన్షిప్‌లో నెలకొన్న సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన మేయర్ సంబంధిత సహాయ ఇంజనీర్‌తో చరవాణి ద్వారా మాట్లాడుతూ.. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ,విద్యుత్ దీపాలు,రెండు పార్కుల అభివృద్ధి తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించి అందజేయాలని సూచించారు. అందుకు స్పందించిన సహాయ ఇంజనీర్ ఒకటి రెండు రోజుల్లో ప్రణాళికను సమర్పిస్తానని తెలిపారు.అదనంగా హర్ష టౌన్షిప్‌లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు అధికార యంత్రాంగంతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ వెంకటయ్య,ఎం.రాజయ్య, ఎల్ బి ఎం రత్నాకర్, బి.శంకర్,బి.శర్మన్,జి.శీను, అశోక్,ప్రొఫెసర్ చిన్న,జ్యోతి, గోపి,ప్రసాద్,వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ రాములు, పిడి మోతిలాల్,కృష్ణ,రామకృష్ణ, నరేంద్ర,వేణు తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest