UPDATES  

NEWS

 మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మాజీ సర్పంచ్ రవి ఆధ్వర్యంలో మహిళలకు ఘన సత్కారం

రాయికల్ (తెలంగాణ వాణి) మహిళలు విద్య,రాజకీయ,సామాజిక సేవా రంగాల్లో రాణించాలని రామాజిపేట మాజీ సర్పంచ్,రాయికల్ ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు వాసరి రవి అన్నారు.మండలం లోని రామాజిపేట గ్రామ రామాలయ కళ్యాణ మండపం లో మాజీ సర్పంచ్ వాసరి రవి ఆధ్వర్యంలో గ్రామం లో నూతనంగా ఎన్నికైన మహిళ వార్డు సభ్యులను,ఐకేపీ మహిళ సంఘ ప్రతినిధులను,సి.ఎ లను,

ఎ.ఎన్.ఎమ్,ఆశ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు గ్రామ స్థాయిలో ప్రజలకు విశిష్ట సేవలు అందించడం శుభపరిణామం అని,ప్రతి ఒక్క మహిళ తమ పిల్లలను విద్య,సామాజిక,ఆర్ధిక, రాజకీయ రంగాల్లో రాణించే విధంగా తీర్చి దిద్దాలని,సావిత్రి బాయి పూలే,ఝన్సీ రాణి లాంటి స్త్రీ మూర్తులను ఆదర్శ వంతంగా తీసుకోవాలని అన్నారు. మహిళలకు సమాజంలో గౌరవం దక్కినప్పుడే గ్రామాలు అభవృద్ధి పథంలో నడుస్తాయని అన్నారు.అనంతరం మహిళా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ మోహన్,ఉప సర్పంచ్ ఇద్దం సుధీర్ రెడ్ది,వార్డు సభ్యులు ఇద్దం మమత తిరుపతి రెడ్ది,మర్రి కళ్యాణి తిరుపతి యాదవ్,జల, ఎ.ఎన్.ఏం జలజ, ఆశ కార్యకర్తలు నాగిరెడ్డి లత, సూర మమత,పడిగెల లావణ్య,రామాలయ కమిటీ చైర్మన్ కోల రాజు, గ్రామ నాయకులు దుగ్యాల లక్ష్మీపతి రావు,బేతి వంశీ రెడ్ది,ఇద్దం గంగారెడ్డి,విజయ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest