UPDATES  

NEWS

ఆగస్టు 27న ఉద్యోగుల ‘మహాధర్నా’ విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించిన రాజమౌళి- అరుణ దంపతులు ఇందిరమ్మ మోడల్ కాలనీలో విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల

 ఆగస్టు 27న ఉద్యోగుల ‘మహాధర్నా’

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని టీజీఈ -జేఏసీ డిమాండ్

కొత్తగూడెం ( తెలంగాణ వాణి) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ – జేఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 27న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు మహాధర్నాకు సంబంధించిన నోటీసును అందజేశారు. రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను నెలకు రూ.2 వేల కోట్ల చొప్పున చెల్లించాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపడతామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీఈ – జేఏసీ జిల్లా చైర్మన్ అమరనేని రామారావు, కన్వీనర్ సంగం వెంకట పుల్లయ్య, యుటిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు, పెన్షనర్ల సంఘం నాయకులు వేస్లీ, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు రామ్ రవి తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 25 August 2026, 9:58 am Posted by : TELANGANA VANI

ఆగస్టు 27న ఉద్యోగుల ‘మహాధర్నా’

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని టీజీఈ -జేఏసీ డిమాండ్

కొత్తగూడెం ( తెలంగాణ వాణి) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ - జేఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 27న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు మహాధర్నాకు సంబంధించిన నోటీసును అందజేశారు. రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను నెలకు రూ.2 వేల కోట్ల చొప్పున చెల్లించాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపడతామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీఈ - జేఏసీ జిల్లా చైర్మన్ అమరనేని రామారావు, కన్వీనర్ సంగం వెంకట పుల్లయ్య, యుటిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు, పెన్షనర్ల సంఘం నాయకులు వేస్లీ, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు రామ్ రవి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest