UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 ఘనంగా టీజిపిఏ ఆవిర్భావ దినోత్సవం

పెద్దపల్లి (తెలంగాణ వాణి విలేకరి) బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడలిలో తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టీజిపిఏ) వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరి యాదయ్య ఆదేశాల మేరకు టీజీపీఏ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి సీలుముల సంజీవ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద టీజీపీఏ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సంజీవ్ మాట్లాడుతూ.. తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపిఏ) 2016లో ఆవిర్భవించి రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అండగా నిలుస్తూ వారికి అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందడుగు వేస్తుందని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సంఘంగా ముందడుగు వేస్తుందని విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలో జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ పాఠశాలలను సందర్శించి ఆయా పాఠశాల కళాశాలలలో పేరెంట్స్ కమిటీలు వేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజిపిఏ జిల్లా నాయకులు సుంచు మల్లేశం, గుమ్మడి కొమురయ్య ,పులిపాక రవీందర్, లంక దాసరి భాస్కర్, గుండేటి శ్రీనివాస్, రామిండ్ల బాబు, కుమ్మరి తిరుమల్, పరమేశ్వర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest