UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం అధ్యక్షుడు మాజీ ఉపసర్పంచ్ వోడ్నాల శంకరయ్య ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజ సేవ ,విద్య వ్యాప్తి, సాంఘిక సంస్కరణలో చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన చేసిన సేవలను వారి ఆశయాలను ఈ తరం యువత ముందుకు తీసుకువెళ్లాలని శంకరయ్య కోరారు. ఈ కార్యక్రమంలో దాసి రవీందర్,వడ్నాల రవి, దేవసాని సత్యం ,ఎలిగేటి మహేందర్ ,విట్ట రవి, వాడ్నాల రాజ్ కుమార్, సాంబరి అంజి, వడ్నాల సతీష్, బొమ్మ వరం వేణుగోపాల్ రావు, ఆవుల ఐలయ్య బత్తిని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest