UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) సోనాల మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలొ పిల్లలు రకరకాల ఆహార పదార్థాలను వారి కుటుంబ సభ్యుల సహకారంతో తయారుచేసుకొని వచ్చి పాఠశాలలో ఏర్పాటు చేయబడినటువంటి స్టాల్స్ లో అమ్మకం చేయడం, పోషకులు విద్యార్థులు ఉత్సాహంగా స్టాల్స్ తిరుగుతూ ఆహార పదార్థాలను కొని రుచి చూసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సోనాల పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ కుంట నవీన్ రెడ్డి విద్యార్థులు తయారు చేసినటువంటి స్టాల్స్ ను పరిశీలించి ఆహార పదార్థాలను రుచి చూస్తూ పదార్థాల గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నాణ్యమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ చైతన్య, ఓరుగంటి ఇస్తారి, కచ్చకాయల అవినాష్, ఉపాధ్యాయ బృందం పోషకులు విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest