UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం

జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంగ మహేందర్

ధర్మారం (తెలంగాణ వాణి) తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు చెందిన రిజర్వేషన్ల ను అడ్డుకున్నందుకు నిరసనగా బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు వ్యాపార వాణిజ్య సంస్థలు సంపూర్ణ మద్దతు తెలుపాలని జాతీయ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి జంగ మహేందర్ కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసినప్పటికీ అట్టి జీవో పై హైకోర్టు స్టే విధించడం అత్యంత బాధాకరమని ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు నోటి కాడి ముద్ద లాగేసినట్టు భావావించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనదని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఎన్నికల్లో కోర్టు జోక్యం చేసుకోవడం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ధర్మసానం పై బీసీలందరికీ అపారమైన నమ్మకం ఉందని ఆయన అన్నారు. బీసీలు అందరు కలిసి రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలు తెలిపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు దేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక జనాభా కలిగిన మనము మన వాటా ఏందో ఎంతో తెలుసాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాలు అన్ని ఈ రోజు ఏక తాటి పై వచ్చి బంద్ కి పిలుపునిచ్చారన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest