UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం

జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంగ మహేందర్

ధర్మారం (తెలంగాణ వాణి) తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు చెందిన రిజర్వేషన్ల ను అడ్డుకున్నందుకు నిరసనగా బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు వ్యాపార వాణిజ్య సంస్థలు సంపూర్ణ మద్దతు తెలుపాలని జాతీయ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి జంగ మహేందర్ కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసినప్పటికీ అట్టి జీవో పై హైకోర్టు స్టే విధించడం అత్యంత బాధాకరమని ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు నోటి కాడి ముద్ద లాగేసినట్టు భావావించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనదని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఎన్నికల్లో కోర్టు జోక్యం చేసుకోవడం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ధర్మసానం పై బీసీలందరికీ అపారమైన నమ్మకం ఉందని ఆయన అన్నారు. బీసీలు అందరు కలిసి రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలు తెలిపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు దేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక జనాభా కలిగిన మనము మన వాటా ఏందో ఎంతో తెలుసాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాలు అన్ని ఈ రోజు ఏక తాటి పై వచ్చి బంద్ కి పిలుపునిచ్చారన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest