UPDATES  

NEWS

ప్రొఫెషనల్ హస్తకళాకారులు రాజస్థానీలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) వినాయక చవితి అంటేనే మనకు గుర్తుకు వచ్చేది రకరకాల ఆకృతిలొ కనిపించే గణనాథుల విగ్రహాలు… వాటిని తయారు చేయడంలో రాజస్థానీలకు ప్రత్యేకత ఉంది. కుటుంబ సభ్యులు, పిల్లలు సైతం విగ్రహాల తయారీలో నిమగ్నమైపోతారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గత మూడేళ్లుగా రాజస్థానీలు ఇక్కడ గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. వివిధ రకాల గణనాథుల విగ్రహలను ఆకర్షణీయంగా తయారు చేస్తు ఉపాధి పొందుతున్నారు. ధర్మారం చుట్టుపక్కల మండలాలకు చెందిన వందలాది […]

జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పైన ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి మరణించారు. ఆయన స్వగ్రామమైన భువనగిరిలో జిటా బాలకృష్ణారెడ్డి అంతక్రియలు జరగనున్నాయి. జిట్టా బాలకృష్ణ మృతి పట్ల గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలుపుతున్నారు.

పిడుగుపాటుకు పాడి గేదె మృతి

హుస్నాబాద్ తోటపల్లి (తెలంగాణ వాణి స్పాట్ న్యూస్)   సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో బంక మల్లవ్వ వ్యవసాయ పొలం వద్ద బుధవారం ఉదయం ఆరు గంటలకు”పిడుగు”పడి పాలిచ్చే గేదె అక్కడికక్కడే మృతి చెందింది. కాగ రోజు ఐదు లీటర్లు పాలిచ్చి కుటుంబాన్ని ఆదుకునే గేదె మృతి చెందడంతో దాదాపు 70 వేల రూపాయలు నష్టం జరిగిందని దానితోపాటు జీవనోపాధి కోల్పోయామని ఆ కుటుంబం కన్నీళ్ల పర్వంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

బ్రిడ్జి డ్యామేజ్ తో గ్రామస్తుల ఇబ్బంది

ఎమ్మెల్యే ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు 3 గంటల్లో సమస్యకు పరిష్కారం లభించడంతో గ్రామస్తుల హర్షం పాల్వంచ (తెలంగాణ వాణి) ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలుతో మందెరికలపాడు అలుగు పొంగి బ్రిడ్జి డ్యామేజ్ అవడంతో ఉల్వనూరు ప్రజలకు పాల్వంచ రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. సోమవారం పాల్వంచ మండల పర్యటనలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు విషయాన్ని తెలుపగా ఆయన పంచాయతీ రాజ్ ఆర్&బి అధికారులను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. సంబంధిత […]

సేమ్ ఐటమ్ ఒక్కొక్కరికి ఒక్కో రేటు

ఆర్టీసీ బంక్ ముందు అడ్డగోలు దందా మేమేం చేయలేమంటున్న బంక్ నిర్వాహకులు కొత్తగూడెం (తెలంగాణ వాణి) కొత్తగూడెం బస్టాండ్ పక్కనున్న ఆర్టీసీ బంక్ వద్ద కొంతమంది యువత వాహనాల శైనింగ్ కోసం అంటూ స్ప్రే అమ్మకాలు చేస్తున్నారు. 350 రూపాయల MRP ఉన్న బాటిల్ ఒక్కోక్కరికి ఒక్కో ధరకు అమ్ముతు మోసం చేస్తున్నారు. ఆర్టీసీ పెట్రోల్ బంక్ కు వచ్చే వారి వాహనాలకు అడ్డం పడి మరీ ఇబ్బంది పెడుతు, మాయ మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇక్కడ […]

ప్రభుత్వంపై స్వరం మార్చిన కూనంనేని

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)   కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని అన్నారు. చెరువుల ఆక్రమణలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ రంగనాథ్ మంచి మనిషి అని… పనిలో స్పీడ్ ఉందని కూనంనేని కొనియాడారు. చెరువులు, శికం భూమిలో పర్మిషన్ ఇచ్చిన అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ […]

ఆ స్కూల్ కూల్చొద్ధంటున్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ (తెలంగాణ వాణి) కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. కానీ ఆ స్కూల్ కూల్చకండంటూ అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్లు నిర్మించామని వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని గతంలో కూడా తనపై కాల్పులు జరిగాయని కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కత్తులతో దాడి చేయండి. కానీ పేదల విద్యాభివృద్ధి […]

మాకు హైడ్రా కావాలంటున్న భద్రాద్రి జిల్లా ప్రజలు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) చెరువలను, కుంటలను కబ్జా చేసి విలాసవంతమైన భావనాలు నిర్మించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సీనియర్, సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్న రంగనాధ్ IPS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రా చేస్తున్న సంస్కరణలకు తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయ, ఆర్థిక పరపతితో చెరువులు కుంటలు కబ్జాలు చేస్తూ మా నిర్మాణాలు చేస్తున్న వారిపై ఎన్ని విధాలుగా ఫిర్యాదులు చేసిన వాళ్లకు భయపడి […]

గనుల సమీపంలో బెల్ట్ షాపులు బంద్ చేయించండి

ఏరియా ఎస్ఓ to జిఎం డి. శ్యాంసుందర్ కు వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకుడు కర్నే బాబురావు మణుగూరు (తెలంగాణ వాణి) మణుగూరు గనుల సమీపంలోని బెల్ట్ షాపులు కార్మికులను రా -రమ్మని ఆకర్షిస్తు ప్రమాదాలకు కారణభూతం అవుతున్నాయని తక్షణమే బెల్ట్ షాపులు బంద్ చేయించాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు డిమాండ్ చేశారు. ఏరియా ఎస్ఓ to జిఎం డి. శ్యాంసుందర్ కు వినతిపత్రం అందించినట్టు బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

ఒకేసారి టీ.పీసీసీ అధ్యక్షుడు, కొత్త మంత్రుల పేర్ల ప్రకటన

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. కొత్త సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం ఒకేసారి కొత్త అధ్యక్షుడి పేరుతో పాటు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి పేర్లను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్‌గా బీసీ నేతనే నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు లీకులు వెలువడ్డాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా […]