సినీనటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలి : అఫ్జల్ పఠాన్

మీది అహంకారామా ? అసహనమా ? మీ ఇంటి రచ్చను మీరే రోడ్డున పడేసి మీడియాపై ఆగ్రహం ఎందుకు ? హైదరాబాద్ (తెలంగాణ వాణి) సినీ నటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ అఫ్జల్ పఠాన్ డిమాండ్ చేశారు. మీడియాపై మంచు మోహన్ బాబు దాడిచేయడం ఆయన విలువను దిగజార్చుతుందని మోహన్ బాబు క్షమాపణ చెప్పకపొతే మీడియా అంటే ఏంటో ఆయనకు తెలిసేలా చేస్తామన్నారు. గత 3 రోజులుగా సినీ ఇండస్ట్రీతో పాటు, 2 […]
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయండి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు డీజేయూ వినతి కొత్తగూడెం (తెలంగాణ వాణి) భద్రాద్రి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు అయ్యేలా చూడాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ కన్వీనర్ సీమకుర్తి రామకృష్ణ, కో-కన్వీనర్ అఫ్జల్ పఠాన్ వినతి పత్రం అందిచారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో, చానళ్ళలో రిపోర్టర్లుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య […]
కావాలనే కుట్ర చేస్తున్నారు : వనమా రాఘవ

రవిచంద్ర నాయకత్వం లోనే పని చేస్తాం తెలంగాణ వాణిలో వచ్చిన కథనంపై వనమా రాఘవ ఖండన కొత్తగూడెం (తెలంగాణ వాణి ప్రతినిధి) రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం, గత ఎన్నికల్లో మా నాన్న వనమా వెంకటేశ్వర రావు గెలుపు కోసం మన ప్రియతమ నాయకులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసిందే. ఎన్నికల సమయంలో నిద్రాహారాలు మాని వనమా వెంకటేశ్వర రావు గెలుపు కోసం ఆయన పడ్డ కష్టాన్ని తాను దగ్గరుండి చూసానని వనమా […]
జర్నలిస్టుల సంక్షేమానికి ఉద్భవించిందే డీజేయు

డీజేయు ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా వేదికగా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఇళ్లు, ఇళ్ల స్థలాలు సాధనే ధ్యేయంగా అడుగు ముందుకు వేస్తున్నాం జర్నలిస్టుల హక్కుల సాధనకు ప్రత్యేక ఉద్యమం డిజేయు జాతీయ కన్వీనర్ బి. లక్ష్మీనర్సింహా కొత్తగూడెం (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి డీజేయు యూనియన్ కృషి చేస్తుందని సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెం టిఎస్ యూటిఎఫ్ కార్యాలయంలో సీమకుర్తి రామకృష్ణ అధ్యక్షతన కో-ఆర్డినేటర్స్ […]
మత్తు పదార్దాల అనర్దాలపై విస్తృత ప్రచారం

జిల్లా పరిధిలోని పాఠశాలలు, కళాశాలలో జిల్లా పోలీస్ అవగాహనా కార్యమాలు కొత్తగూడెం (తెలంగాణ ప్రతినిధి) జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలోని పాఠశాలలు కళాశాలలలో విద్యార్థిని, విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వలన వాటిల్లే నష్టాల గురించి స్థానిక పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చాలామంది యువత మత్తుకు బానిసలై తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, మత్తు వలన విచక్షణ కోల్పోయి ప్రమాదాలకు […]
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలి

కొత్తగూడెం (తెలంగాణ వాణి) తెలుగు విశ్వ విద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును యధావిధంగా కొనసాగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దారా రమేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించి తెలుగు భాషాభిమానుల అభిమానం చూరగొన్న అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును తెలుగు […]
ఢిల్లీ సీఎంగా అతిషి

తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్) రాజధాని ఢిల్లీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్పై బయటకు వచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న సందేహం కలిగింది. ఈ క్రమంలో అతిషీ, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేర్లు వినిపించాయి. చివరకు మంత్రి అతిషీకి ముఖ్యమంత్రి […]
ఎన్నికల షెడ్యూల్ రాకముందే సర్పంచ్ ఎన్నిక

చెరువుకొమ్ము తండా సర్పంచ్ ఏకగ్రీవం సంబరాలు చేసుకున్న గ్రామస్తులు తెలంగాణలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండా సర్పంచ్ ఏకగ్రీవమయ్యాడు. సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి పండగ, పోచమ్మతల్లి, ఆంజనేయుడికి మూడు గుళ్లు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి ఖర్చు కోసం ఇంటింటికి రూ.1000 చొప్పున పంచుతానని దరావత్ బాలాజీ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. అందుకుగానూ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీచేయకుండా, తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్పెట్టాడు. అయితే మాట తప్పితే […]
తప్పని తెలీతే నేనే కూల్చేస్తా : ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) కొత్వాల్ గూడలోని తన ఫాంహౌస్ అక్రమ నిర్మాణమంటూ వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్వాల్ గూడలోని సర్వే నెం.13లో తన కుమారుడి పేరుతో 14.14 ఎకరాల పట్టా భూమి ఉందని చెప్పారు. ఆ భూమిని 1999లో కొనుగోలు చేశామని, 2005 లో నిబంధనల మేరకే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్న కట్టడం కట్టుకున్నామని వివరించారు. అప్పటి ప్రభుత్వం నుంచి, […]
బజాబ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ ఆగడాలు

ఈఎంఐ కట్టలేదని కోడిని ఎత్తుకెళ్లారు కొత్తగూడెం (తెలంగాణ వాణి) బజాజ్ ఫైనాన్స్ లో మీరు ఏదైనా ప్రోడక్ట్ లోన్, లేదా పర్సనల్ లోన్ తీసుకున్నారా ? జాగ్రత్త ఈఎంఐ కట్టడం అసలు మిస్ చేసుకోకండి. ఖర్మ కాలి ఈఎంఐ బౌన్స్ అయితే బ్యాంక్ లో చెక్ బౌన్స్ ఛార్జ్, బజాజ్ లో లేట్ పేమెంట్ ఛార్జ్ మాత్రమే కాకుండా రికవరీ ఏజెంట్ లకు కూడ ఏదో ఒక విధంగా ఛార్జ్ కట్టాల్సిందే. చెక్ బౌన్స్, లేట్ పేమెంట్ […]