UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎంపీ వంశీకృష్ణ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్యది నిరుపేద కుటుంబం, గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ లో వాచ్ మెన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. సదయ్య భార్య మాధవి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి, వెంటనే మాధవి తన కుమారుడిని ఎత్తుకొని ఆరు బయటకు వచ్చి పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పి వేశారు. ప్రమాదంలో గుడిసె పూర్తిగా దగ్ధం కాగా అందులో ఉన్న సామాన్లు మంటల్లో కాలి బూడిద అయ్యాయి. అనంతరం చుట్టుపక్కల ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పి వేశారు అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సదయ్య కుటుంబానికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం పంపించగా అట్టి రూపాయలను మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాడే సూర్యనారాయణ శనివారం బుచ్చయ్య పల్లి గ్రామానికి వెళ్లి సదయ్య కుటుంబానికి మనోధైర్యం నింపి ఎంపీ పంపించిన 20 వేల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో పొన్నవేని స్వామి, బొంగాని సత్యనారాయణ ,నారలక్ష్మణ్, మేడే మహేందర్ ,కాల్వ పవన్ ,దుంపేటి సదానందం, గంప శ్రీధర్ ,పూసల సదానందం, ఆవుల రాజయ్య, పొడేటి అంజయ్య కంచు హనుమంతు, వేల్పుల స్వామి, బండారి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest