మొక్కలు నాటి వనజీవి రామయ్యకు ఘన నివాళులు
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ పద్మశ్రీ వనజీవి రామయ్య మృతికి సంతాపంగా లక్ష్మీ దేవి పల్లి లో గల అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణంలో ప్రకృతి ప్రేమికులు పతాంజలి యోగ గురువు పట్టాభి రామారావు,హరినాథ్ ప్రకృతి వైద్యులు బండి విజయ్ గార్లతో కలిసి మామిడి మొక్కలు నాటి ఘన నివాళులు అర్పించారు.
సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టడం హర్షనీయం:సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్.
సన్న బియ్యం పథకం పక్కదారి పట్టకుండా చూడాలని సేవ్ కొత్తగూడెం సేవ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ కోరారు.సన్న బియ్యం బాగున్నాయి కానీ అన్ని రేషన్ షాపుల్లో ఇదే పద్ధతుల్లో ఉన్నాయో లేదో తెలియదు.సన్న బియ్యం పథకం అక్రమాలకు పాల్పడితే ఆ రేషన్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలి.సన్న బియ్యం ముఖ్యమంత్రి మంత్రులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులతో తినాలి. తెలంగాణలో పండే సన్న వడ్లు వాటితో వచ్చే బియ్యంను పేదలకు పంపిణీ చేయాలి.
పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణా వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను: కె ఎన్ రాజశేఖర్
కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణానికి చింతిస్తూ గుర్తుగా శనివారం నాడు మొక్కను నాటిన ప్రకృతి ప్రేమికుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రకృతి హరిత దీక్ష & గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్, ప్రకృతి హరిత దీక్షా వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని కుటుంబ సభ్యులు తెలిపారు.భూతల్లికి తీరని లోటని ఆయన అన్నారు.పచ్చదనానికి పర్యావరణ పరిరక్షణలో భావితరాలకు ఆస్తులుగా ఇచ్చిన […]
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత

పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో రామయ్య తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. కానీ భారీగా మొక్కలను పెంచుతు తన ఇంటిపేరునే వనజీవి గా మార్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈయన చేసిన కృషికి గుర్తింపుగా సామజిక సేవా విభాగంలో 2017 పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కోటికిపైగా మొక్కలు నాటిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి……ఎంపీ బలరాం నాయక్,ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,కలెక్టర్ జీతీష్ వి పాటిల్,ఐటీడిఏ పిఓ రాహుల్ లతో కలిసి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బూర్గంపహాడ్, అశ్వాపురం,మణుగూరు,పినపాక మండలాల్లో బీటి రోడ్లు, హైలెవల్ బ్రిడ్జి, పాఠశాల అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.ఆయన పర్యటనలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,కలెక్టర్ జీతీష్ వి పాటిల్,ఐటీడిఏ పిఓ రాహుల్ లతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు.
కష్టపడి.. ఇష్టపడి చదివితే అన్ని సాధ్యమే: పి హెచ్ డి స్కాలర్ రంజిత్ బాదావత్
భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం నంద్యా తండ గ్రామవాసి బాదావాత్ సేవియా కుమారుడు బాదావత్ రంజిత్ కుమార్ 2022 డిసెంబర్ సెషన్ లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) సాధించి తదుపరి అతిథి అధ్యాపకులు జూనియర్ లెక్చరర్ గా ములకలపల్లి జూనియర్ కళాశాలలో పనిచేస్తూన్నారు.ఈ నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక యూనివర్సిటీలో పి హెచ్ డి సీటు పొంది మరల తను మాస్టర్ చేసినటువంటి శాతవాహన యూనివర్సిటీలో పి. హెచ్ డి సీటును సాధించాడు.సాధ్యం కానిది […]
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ 2025 జూన్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది.ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటనలో పేర్కొంది.ఇక టెట్ ఆన్లైన్ ఆధారిత కంప్యూటర్ బేస్డ్ పరీక్ష 2025 జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు.ఈ మేరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటన వెలువరించింది. టెట్కు […]
జగిత్యాల కలెక్టరేట్లో అవినీతి కలకలం

లంచం తీసుకుంటూ ఏసీబీ దాడిలో సీనియర్ అసిస్టెంట్ రఘు పట్టివేత జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు జగిత్యాల (తెలంగాణ వాణి) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్ రఘు కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.కోరుట్ల పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పవన్ కుమార్ సిపిఎస్ సంబం ధించిన డబ్బులు తమ అకౌంట్లో జమకావాలని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ […]
పట్టపగలు నడిరోడ్డుపై గోమాత వధ

బహిరంగ ప్రదేశాల్లో వధిస్తున్న చోద్యం చూస్తున్న అధికారులు కోదాడ (తెలంగాణ వాణి) పట్టణ పరిధిలో పట్టపగలు నడి రోడ్డు మీదనే ఆవులను వధిస్తున్నారు. పట్టణంలో ఆవుని కోసిన ఒక సంఘటనలో ఇరుగు పొరుగున నివాసం ఉన్న వ్యక్తులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కమీషనర్ దిగువ అధికారులకు చెప్పి, అంతటితో తన బాధ్యత పూర్తయినట్లు వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేశారని తెలిసి ఆవుని “వధించిన వారు” ఫిర్యాదు చేసిన కుటుంబంలోని మహిళల మీద దాడి చేశారని, […]
పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణ తరగతులు
ఇల్లెందు : సింగరేణి ఇల్లందు ఏరియాలో 2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇల్లందు సింగరేణి కాలరీస్ ఏడెడ్ ఉన్నత పాఠశాలలో ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నటు తెలిపారు.ఈ శిక్షణను స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఇల్లందు ఏరియా సింగరేణి పాఠశాల […]