కొత్తగూడెంలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు.కేక్ కట్ చేసిన అభిమానులు
కొత్తగూడెం పట్టణంలో సెవెన్ హిల్స్ ఏరియా నందు ఎన్ .టి.ఆర్ అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో జూ.ఎన్టీఆర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్,నరేష్, రావణ్, పవన్,సాహస్ స్టీల్,జేమ్స్,నవీన్,గోవర్దన్,సాగర్,ఆఫ్రీద్, ప్రసాద్,మణి కంఠ,వెంకీ,రాకేష్,పర్సా ద్రువన్ స్థానిక యువకులు ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు
పొలం గట్లపై లేదా పొలాల్లో ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటండి
మొక్కలే మానవాళికి జీవనాధారం.. ఎండను సైతం లెక్కచేయకుండా రఘునాథపాలెం మండలం రాములు తండా కు చెందిన బానోత్ బాల్య అనే రైతు ఆదివారం నాడు ఓ మామిడి మొక్కను నాటుతూ అందరూ తమ పొలం గట్లపై, లేదా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటడంలో సహాయంగా రఘు పాల్గొన్నారు
జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత విశ్వామిత్ర చౌహాన్ ను సన్మానించిన జిల్లా జడ్జి వసంత్ పాటిల్
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీ కాన్సెప్ట్ తో గత మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ ను జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ఘనంగా సన్మానించారు.ఇటీవల జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న విషయం తెలుసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ ప్రత్యేకంగా విశ్వామిత్ర చౌహాన్ ను పిలిపించి శాలువతో సన్మానించారు. గతంలో చాలాసార్లు చిన్నారి […]
TUWJ H143 రజతోత్సవ వేడుకలను జయప్రదం చేద్దాం

హుజూరాబాద్ లో నియోజకవర్గ స్థాయి సమావేశం టీజెఫ్ రజతోత్సవ వేడుకలకి భారీగా తరలి వెళ్ళాలని తీర్మానం హుజురాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూ డబ్యూ జే -హెచ్ 143 ఐజె యు) హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాల కృష్ణ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టులు మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడుతు రాష్ట్ర అధ్యక్షుడు అల్లం […]
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ – 143 IJU ) హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం టీ జె ఫ్ రజతోత్సవ వేడుకలు భారీగా తరలి వెళ్లాలని తీర్మానం
హుజూరాబాద్:మే13 (తెలంగాణ వాణి) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ -H 143 IJU) హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాల కృష్ణ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది.ఈ సమావేశంలో జర్నలి స్టులు మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు.సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడు తూ,రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ నాయకత్వంలో మే 31,2025న హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజెఫ్) 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయా […]
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులని మర్యాదా పూర్వకముగా కలిసిన జాతీయ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.మధుకర్.
రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల సమస్యల పట్ల సత్వరమే స్పందించి పరిష్కరించే దిశగా దూసుకుపోతున్న కమిషన్ చైర్మన్ మరియు సభ్యులకు జాతీయ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధుకర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కమీషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ను శాలువాతో సత్కరించి తెలంగాణాలోని ఎస్సీ ఎస్టీ ఇంజనీరింగ్ ఉద్యోగుల పలు సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.కమిషన్ సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడిన తక్షణమే కమిషన్ […]
తెలంగాణ వాణి పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం

– హాజరైన ఎడిటర్,స్టేట్ కో ఆర్డినేటర్,-స్టేట్ న్యూస్ కో ఆర్డినేటర్ బ్యూరోలు కరీంనగర్ బ్యూరో మే 10 (తెలంగాణ వాణి) జగిత్యాల జిల్లా ఎల్ ఎల్ జి గార్డెన్ లో శనివారం ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల తెలంగాణ వాణి పాత్రికేయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కె. వి. మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వాణి పత్రిక […]
యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ దేశ వ్యాప్తంగా రక్త దాతలను అందిస్తున్న జె బి బాలు అభినందనీయులు
యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జె.బి. బాలును మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను బహుమతిగా అందజేసిన ఐక్య తల్లిదండ్రుల సంఘం (యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మారుతి రత్నాకర్,యంగ్ ఇండియన్ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత బాలునాయక్. ఈ సందర్భంగా జె బి బాలు దేశంలో రక్త దాతల క్లబ్ ను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారని కొనియాడారు.ఈ సందర్భంగా ఆయన రత్నాకర్,బాలు నాయక్ లను శాలువాతో కప్పి చిరు […]
ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు
తెలంగాణ ఎస్.ఎస్.స్సి బోర్డు హైదరాబాద్ నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావు(కోటి రావు)కు “బొకేలు వద్దు మొక్కలే ముద్దు” అనే నినాదంతో మొక్కలతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్ పర్యావరణ పరిరక్షణ విభాగం చైర్మన్ బాలు నాయక్,ఆయన సహాచర ఉద్యోగి పి డి బుగ్గ వెంకటేశ్వర్లు ద్వారా ఆ మొక్కను అందజేసారు.
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు

కరీంనగర్ (తెలంగాణ వాణి) కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం లేనప్పటికి అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమాయ్యారు. కాగా ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పలు మండలాల్లో భూమి కంపించిన సీసీ టీవీ ఫుటేజ్ లు సామాజిక మధ్యామాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భూప్రకంపనలు […]