నందా తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ బలరాం కు ఘన సన్మానం
చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీ సర్పంచ్గా మాలోత్ బలరాం ఎన్నికైన సందర్భంగా స్థానిక గిరిజన సంఘాల నాయకులు, ఉద్యోగులు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. పంచాయతీ అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేసి, రాబోయే రోజుల్లో నందా తండాను ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సన్శేమానించిన శేఖరం బంజర గ్రామ ప్రజలు
సిపిఐ పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాల్వంచలోని సిపిఐ కార్యాలయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావును శేఖరం బంజారా గ్రామ ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ అనిల్ నాయక్,రంజిత్ నాయక్, నరేష్ నాయక్,రవి నాయక్, హరిబాబు నాయక్,కవిత,అనూష,భద్ర, హరిత,బుజ్జి,రూపదేవి, అనిత, యువతీ యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఏటీఎంల చోరీ జరిగిన సంఘటన స్థలాలను పరిశీలించిన ఇంచార్జి పోలీస్ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర

ఐదు స్పెషల్ టీం ల ఏర్పాటు, ముమ్మరంగా తనిఖీలు భద్రత బలోపేతం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం నిజామాబాద్(తెలంగాణ వాణి) నిజామాబాద్ నగరంలో శనివారం తెల్లవారు జామున రెండు ఏటీఎంలలో చోరీ జరిగిన సంఘటన స్థలాలను శనివారం ఇంచార్జి పోలీస్ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర పర్యవేక్షించారు. టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని పాంగ్ర బ్రాంచ్ కు సంబంధించిన డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ఏ. టి. ఎమ్, టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ని […]
పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్
లక్ష్మీదేవి పల్లి మండలం సాటివారిగూడెంలోని త్రియేక దేవర్చనాలయం చర్చ్లో పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ మాలోత్.ఈ కార్యక్రమంలో పాస్టర్ ఉంగటూరి అమృత రావు,ప్రభు భూషణం, వెంకట్రావు,జానయ్య, గుంటూరు రాంబాబు, ఏలియా,గడ్డం సురేష్, ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు
త్రియేక దేవర్చనాలయం చర్చ్లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు:పాస్టర్ యు.అమృత రావు
లక్ష్మీదేవి పల్లి మండలం సాటివారిగూడెంలోని త్రియేక దేవర్చనాలయం చర్చ్లో పాస్టర్ యు.అమృత రావు ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులతో కలిసి దేవునికి మహిమ కలిగించేలా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.శాంతి,ప్రేమ, సోదరభావం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పాస్టర్ అమృత రావు కోరారు.ప్రజలందరూ ఏసు ప్రభు సూచించిన మార్గంలో నడవాలని అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలు నాయక్, ప్రభు భూషణం,వెంకట్రావు, జానయ్య,రాంబాబు,ఏలియా,గడ్డం సురేష్,ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు
యేసుక్రీస్తు జన్మదినాన్ని స్మరిస్తూ రాబోయే క్రిస్మస్ పండగ భారతదేశ ప్రజలకు ఆనందం,ప్రేమ,శాంతి, సహనం ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ గిరిజన ఇంజనీరింగ్ శాఖ భద్రాచలం కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా కలిసి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటస్వామి, కార్యాలయ సిబ్బంది భవాని బుచ్చలు, వెంకన్న, బుచ్చిబాబు,రాజేష్ తదితరులు […]
PRTU TS జిల్లా అసోసియేట్ అధ్యక్షులు టి.రవీందర్ కు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు
స్నేహసీలి,మృధుస్వభావి తను ఏ స్థానం ఉన్న అందరిని కలుపుకొని పోయే తత్త్వం, జిల్లాలో ఏ ఉపాధ్యాయుడికి ఇబ్బంది వచ్చిన నేనున్నాను,అని భరోసా కల్పించి పని చేసే గొప్ప వ్యక్తి PRTU TS జిల్లా అసోసియేట్ అధ్యక్షులు టి.రవీందర్ కు భద్రాది జిల్లాలోని పలువురు ఉపాధ్యాయుల సంఘం నేతలు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యాసదస్సును జయప్రదం చేయండి:అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చంద్రు
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు (విద్యా సదస్సును) జయప్రదం చేయండి. ప్రాథమిక పాఠశాల చవిటిగూడెంలో తెలంగాణ టిఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశాలు మరియు విద్యా సదస్సు గోడపత్రిక ను టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రాము,అశ్వాపురం మండల అధ్యక్షులు కారం సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి ఈ.చందు, ఉపాధ్యక్షులు జి.సునీత ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి.రాము మాట్లాడుతూ…విద్యా సదస్సులో తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల […]
ఆళ్లపల్లి ఉప సర్పంచ్గా సయ్యద్ ఆరీఫ్ ను సన్మానించిన కిక్ బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అర్షద్
ఆళ్లపల్లి ఉప సర్పంచ్గా ఎన్నికైన సయ్యద్ ఆరీఫ్ ను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కిక్బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అర్షద్ ముఖ్య అతిథిగా పాల్గొని అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జీవన్ కుమార్, భరత్, పవన్, ఇబ్రహీం,ఇమ్రాన్,సద్దాం, సత్తార్, అక్బర్ తదితరులు పాల్గొని సయ్యద్ ఆరీఫ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
పుట్టిన రోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు పూణెం శ్రీనివాస్ నాగమణి దంపతులు
లక్ష్మిదేవిపల్లి మండలం సంజయ్ నగర్ గ్రామానికి చెందిన గ్రామపెద్దలు కుంజ సమ్మయ్య అనసూర్య దంపతుల మనవరాలు, కుంజ నరేష్ విజయ దంపతుల కూతురు తోషిణి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూణెం.శ్రీనివాస్ నాగమణి దంపతులు. ఈ కార్యక్రమంలో లక్ష్మిదేవిపల్లి సర్పంచ్ తాటి అనిత తిరుమలేష్ దంపతులు, జిల్లా ఏఈడబ్ల్యూసీఏ నాయకులు మలకం సాములు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు చింత రాములు,కుంజ సమ్మయ్య తదితరులు ఉన్నారు.