UPDATES  

NEWS

 రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే కూనంనేని

కొత్తగూడెం (తెలంగాణ వాణి) రాజ్యసభ సభ్యుడుగా ఇటీవలే ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వేం నరేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు తేవడంతో, ప్రజల సమస్యలను రాజ్యసభ ద్వారా పరిష్కరించేందుకు వేం నరేందర్ రెడ్డి సేవలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా తనను సన్మానించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest