జగిత్యాల, ఫిబ్రవరి 22 (తెలంగాణ వాణి):
పెగడపల్లి మండలం మల్యాల వరద కాలువలో కారు పడిపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు తిర్మణి రమణ మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుద్ధపల్లి గ్రామానికి చెందిన తిర్మణి రమణ అనుమానాస్పద స్థితిలో కారుతో సహా మల్యాల వరద కాలువలో శవమై కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కారును బయటకు తీసి పరిశీలించగా అందులో రమణ మృతదేహం లభ్యమైంది.
తిర్మణి రమణ పెగడపల్లి సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్గా సేవలందించారు. ఆయన మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఇతర కారణాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో పెగడపల్లి మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రమణ మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు
Post Views: 72
