UPDATES  

NEWS

హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన వైభవంగా సర్వారం ఒడ్డుగూడెం తండాలో కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం మండల కమిటీ నుంచి ఎంఈఓకు ప్రాతినిధ్యం

 కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న బిజెపి

కరీంనగర్ (తెలంగాణ వాణి) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. ముఖ్యంగా కరీంనగర్ కార్పోరేషన్ లో హంగ్ ఏర్పడటం, ఏ పార్టీకి పూర్తిగా మెజారిటీ రాకపోవడంతో అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. ఏడు కార్పోరేషన్ లలో కరీంనగర్ పీఠంను దక్కించుకునేందుకు అన్నిపార్టీలు తమదైన వ్యూహలతో ముందుకు వెళ్లిన చివరకు కాషాయ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీ సొంతం చేసుకుంది. కరీంనగర్ లో 66 స్థానాలకు గాను బీజేపీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, మజ్లిస్ 3, ఇతరులు 10 మంది కార్పొరేటర్లుగా గెలిచారు. కార్పొరేషన్‌లో ఎక్స్‌అఫీషియోతో కలిపి సభ్యుల సంఖ్య 69కి చేరగా, మేయర్ పదవికి 35 మంది మద్దతు అవసరం. ఎన్నికల అనంతరం బీజేపీలో కొందరు కార్పొరేటర్లు చేరడంతో, బీజేపీ బలం 34 వరకు చేరుకుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహత్మకంగా ముందుకు వెళ్లడంతో కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ సొంతమయ్యింది. కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు. మొత్తంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తన వ్యూహలతో ఎలాగైన కరీంగనగర్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేయాలని ఆయన తన పంతంను నెగ్గించుకున్నట్లైంది. మొత్తంగా బీజేపీ క్యాడర్ కూడా దీనిపై ఫుల్ జోష్ గా ఉన్నారు. మరోవైపు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటున్నామని ముందే ప్రకటించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest