UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 ప్రజలకు అప్రమత్తత సూచనలు

వేములవాడ రూరల్, ఫిబ్రవరి 20 (తెలంగాణ వాణి):

వేములవాడ పట్టణ శివారులోని హన్మక్కపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు రోమాల భూమయ్య పొలం వద్ద కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత అడుగుల ఆనవాళ్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గస్తీ పెంచినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వేములవాడ రూరల్ ఎస్‌ఐ వెంకట్రాజం మాట్లాడుతూ, హన్మక్కపల్లి వరకు చిరుత సంచారం ఉన్నందున రూరల్ మండల పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అధికారులు సూచించిన జాగ్రత్తలు:

పొలం వద్దకు ఒంటరిగా వెళ్లకూడదు

రాత్రి సమయంలో పొలాలకు వెళ్లకుండా ఉండాలి

పశువులను రాత్రిపూట ఇంటి వద్ద కట్టేయాలి

చిరుత సంచారం గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలి

ప్రజలు భయపడకుండా, కానీ జాగ్రత్తలు పాటిస్తూ అధికారులతో సహకరించాలని సూచించారు.

ప్రజలకు అప్రమత్తత సూచనలు

వేములవాడ రూరల్, ఫిబ్రవరి 20 (తెలంగాణ వాణి):
వేములవాడ పట్టణ శివారులోని హన్మక్కపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు రోమాల భూమయ్య పొలం వద్ద కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత అడుగుల ఆనవాళ్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గస్తీ పెంచినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వేములవాడ రూరల్ ఎస్‌ఐ వెంకట్రాజం మాట్లాడుతూ, హన్మక్కపల్లి వరకు చిరుత సంచారం ఉన్నందున రూరల్ మండల పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారులు సూచించిన జాగ్రత్తలు:
పొలం వద్దకు ఒంటరిగా వెళ్లకూడదు
రాత్రి సమయంలో పొలాలకు వెళ్లకుండా ఉండాలి
పశువులను రాత్రిపూట ఇంటి వద్ద కట్టేయాలి
చిరుత సంచారం గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలి
ప్రజలు భయపడకుండా, కానీ జాగ్రత్తలు పాటిస్తూ అధికారులతో సహకరించాలని సూచించారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest