UPDATES  

NEWS

 శ్రీ చైతన్య పాఠశాలలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు

జగిత్యాల/ వెల్గటూర్:(తెలంగాణ వాణి ప్రతినిధి) మండల కేంద్రంలోని శ్రీ చైతన్య మోడల్ పాఠశాలలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు బిడారి సతీష్ ఆధ్వర్యంలో చిన్నారుల చేత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 2025 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. విద్యార్థులు గత సంవత్సరంలో చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా విద్యను కష్టంగాకుండా ఇష్టంగా చదవాలని కొనియాడారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి సాధన చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి, రాజేష్, శ్రావణి, సమత, శ్రీ లేఖ, వనజ, కృపాకర్, ఆండాళ్, రజిత, కళ్యాణి, సంధ్య, మల్లీశ్వరి, రజిత, అంజలి, మంజు భార్గవి, నవ్య, అనూష, సాహితి, శిరీష, కార్తిక, స్వప్న, సువర్ణ, మమత,శిరీష, మానస, అనిత విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest