UPDATES  

NEWS

విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించిన రాజమౌళి- అరుణ దంపతులు ఇందిరమ్మ మోడల్ కాలనీలో విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి

 పల్లెల్లో మద్యం ఏరులై పారాలే

జూలూరుపాడు వైన్ షాపు యజమానుల ‘బెల్ట్‌’ దందా

సిండికేట్ ఏర్పాటుకు అంతా సిద్ధం

జూలూరుపాడు (తెలంగాణ వాణి) మండలంలో మద్యం షాపు యజమానులు సిండికేట్‌ దందాకు తెరలేపారు. అధిక లాభాలు గడించేందుకు బెల్టుషాపుల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో 2 మద్యం షాపులు ఉండగ మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి మరోమారు మద్యం ప్రియులపై భారం మోపనున్నారు.

మందుబాబుల పైనే భారం అంతా

గల్లీ గల్లీకి బెల్ట్ షావు పెట్టేలా పల్లెల్లో తమ వారిని ప్రోత్సహిస్తు రాబోయే రెండేళ్లలో భారీ సంపాదన ధ్యేయంగా సిండికేట్ ద్వారా వసూల్ చేయాలని మద్యం మాఫియా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటుగా గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేయబోయే బెల్ట్ షాప్ లకు అనధికార లైసెన్స్ ఇవ్వడం ద్వారా కూడా లక్షలాది రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. క్వాటర్ పై 20 రూపాయలు, బీరు పై 25 రూపాయలు అదనంగా పెంచడం ద్వారా తమ ఆదాయం పెంచుకునేలా సిండికేట్ భావిస్తున్నట్లు సమాచారం. అధిక ధరలకు కొనుగోలు చేసిన బెల్టు షాపుల వారు మరో 20 రూపాయలు పెంచితే ఏకంగా గ్రామాల్లో MRP కన్నా క్వాటర్ బాటిల్ పై 40, బీరు బాటిల్ 45 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. మందుబాబులు గ్రామాల్లో విధిలేని పరిస్థితుల్లో పెరిగిన ధరను పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అధికారులు ఏమి చేస్తున్నట్లు..?

బెల్ట్ షాపుల ద్వారా అమ్మకాలు చేస్తే అధికారులు ఏమి చేస్తారనే సందేహం ప్రజల్లో కలుగుతుంది. గ్రామాల్లో బెల్ట్ తోలు తీయడానికి ఎక్సైజ్, పోలీస్ అధికారుల పాత్ర గణనీయంగా ఉండాలి. కానీ ఇక్కడ బెల్ట్ షాప్ ల జోలికి వెళ్లకుండా ఇక్కడ సిండికేట్ యంత్రాంగం ఇప్పటికే పోలీస్, ఎక్సైజ్ అధికారులకు భారీ మొత్తంలో మామూళ్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Date of Publish : 1 January 2026, 6:04 pm Posted by : TELANGANA VANI

పల్లెల్లో మద్యం ఏరులై పారాలే

జూలూరుపాడు వైన్ షాపు యజమానుల ‘బెల్ట్‌’ దందా

సిండికేట్ ఏర్పాటుకు అంతా సిద్ధం

జూలూరుపాడు (తెలంగాణ వాణి) మండలంలో మద్యం షాపు యజమానులు సిండికేట్‌ దందాకు తెరలేపారు. అధిక లాభాలు గడించేందుకు బెల్టుషాపుల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో 2 మద్యం షాపులు ఉండగ మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి మరోమారు మద్యం ప్రియులపై భారం మోపనున్నారు.

మందుబాబుల పైనే భారం అంతా

గల్లీ గల్లీకి బెల్ట్ షావు పెట్టేలా పల్లెల్లో తమ వారిని ప్రోత్సహిస్తు రాబోయే రెండేళ్లలో భారీ సంపాదన ధ్యేయంగా సిండికేట్ ద్వారా వసూల్ చేయాలని మద్యం మాఫియా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటుగా గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేయబోయే బెల్ట్ షాప్ లకు అనధికార లైసెన్స్ ఇవ్వడం ద్వారా కూడా లక్షలాది రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. క్వాటర్ పై 20 రూపాయలు, బీరు పై 25 రూపాయలు అదనంగా పెంచడం ద్వారా తమ ఆదాయం పెంచుకునేలా సిండికేట్ భావిస్తున్నట్లు సమాచారం. అధిక ధరలకు కొనుగోలు చేసిన బెల్టు షాపుల వారు మరో 20 రూపాయలు పెంచితే ఏకంగా గ్రామాల్లో MRP కన్నా క్వాటర్ బాటిల్ పై 40, బీరు బాటిల్ 45 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. మందుబాబులు గ్రామాల్లో విధిలేని పరిస్థితుల్లో పెరిగిన ధరను పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అధికారులు ఏమి చేస్తున్నట్లు..?

బెల్ట్ షాపుల ద్వారా అమ్మకాలు చేస్తే అధికారులు ఏమి చేస్తారనే సందేహం ప్రజల్లో కలుగుతుంది. గ్రామాల్లో బెల్ట్ తోలు తీయడానికి ఎక్సైజ్, పోలీస్ అధికారుల పాత్ర గణనీయంగా ఉండాలి. కానీ ఇక్కడ బెల్ట్ షాప్ ల జోలికి వెళ్లకుండా ఇక్కడ సిండికేట్ యంత్రాంగం ఇప్పటికే పోలీస్, ఎక్సైజ్ అధికారులకు భారీ మొత్తంలో మామూళ్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest