UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాభివృద్ధి : మద్దెల సుధీర్

కొత్తగూడెం (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి పల్లె ప్రగతికి బాటలు వేసిందని మద్దెల సుధీర్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం చుంచుపల్లి మండలం మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తో కలిసి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి గ్రామాల అభివృద్ధి కోసం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. రైతు భరోసా, రైతు బీమా, వృద్ధులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ కాకతీయ పథకంతో చెరువులను పూడిక తీసి భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేసిందని తెలిపారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి తాగునీరు అందించి, స్వచ్ఛ గ్రామాల ఏర్పాటుకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టిందని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను, పండించిన పంటకు మద్దతు ధర కల్పించిన ఘనత బీఆర్ఎస్ కే దక్కిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రవేశపెట్టిందని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె ప్రగతి అటకెక్కిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కనుమరుగైందని, ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందుకే తీవ్రఇబ్బందులు పడుతున్నారని, రైతుబంధు పెట్టుబడి సహాయం అందక రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest