ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ఎన్నికల కేంద్రాల పరిశీలనలో భాగంగా శనివారం మండలంలోని శాయంపేట పాఠశాలను సందర్శించిన ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్. అనంతరం పాఠశాల విద్యార్థులతో పరస్పరం సంభాషించారు. ఎస్సై అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు చక్కని సమాధానాలు ఇవ్వడంతో ఎస్సై విద్యార్థులను అభినందించి ఆనందపడ్డారు. అనంతరం విద్యార్థులు ఎస్సైతో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. దయ్యాల మనీంద్ర మార్చి ఫాస్ట్ చేస్తూ సెల్యూట్ చేయడం పట్ల ఎస్సై ఆకర్షితులయ్యారు. విద్యార్థులు చదువులతో పాటు ఆటపాటల్లో ముందుండి మంచి ప్రతిభ కనబరిచి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఎస్సై విద్యార్థులకు సూచించారు. అనంతరం హెచ్ఎం జాడి శ్రీనివాస్ తో మాట్లాడుతూ స్కూల్ వాతావరణం పరిశుభ్రంగా ఉన్నదని కితాబు ఇచ్చారు.
Post Views: 359



