UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 తెలుగు వెలుగు సాహితీ వేదిక అవార్డు అందుకున్న షేక్ మాయ మస్తాన్

ఖమ్మం (తెలాంగాణ వాణి) మ్యాజిక్ కళా రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదిక అవార్డును ఖమ్మం వాసి షేక్ మాయ మస్తాన్ అందుకున్నారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి 2025 -2026 అంతర్జాతీయ తెలుగు భాషా సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు హైదరాబాద్ శ్రీ త్యాగరాయ కళావేదిక లో జరిగాయి . ఈ అవార్డును తెలుగు వెలుగు సాహితీ వేదిక చైర్మన్ పోలోజు రాజకుమార్ చార్యులు , తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళా భరణం కృష్ణ మోహన్ రావు , ప్రముఖ జ్యోతిష్య నిపుణులు దైవజ్ఞ శర్మ గురువు , తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ చారి లు అందించారు . ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మస్తాన్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి మ్యాజిక్ రంగంలో మ్యాజిక్ ని కష్టపడి నేర్చుకున్నానని , వారిది వీధి గారడి చేసుకునే కుటుంబంలో నుంచి వచ్చానని , నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి మ్యాజిక్ ఐటమ్స్ నేర్చుకొని మ్యాజిక్ రంగంలో అందరూ మెచ్చుకునే విధంగా ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ప్రోగ్రామ్స్ చేస్తున్నానని అన్నారు . తన ప్రతిభను చూసి పెద్దలు మహానంది అవార్డును ఇచ్చారని తెలిపారు . మరికొన్ని మ్యాజిక్ సామాన్లు కొనుక్కొని ఇంకా చాలా ప్రోగ్రాలు చెయ్యడానికి ఆర్థిక సహాయం కింద ప్రభుత్వం లోన్స్ ఇప్పించాలని కోరారు .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest