గన్ తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య
ములుగు (తెలంగాణ వాణి బ్యూరో)
ములుగు జిల్లా వాజేడు మండలం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్ ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో వాజేడు మండల సమీపంలోని మండపాక వద్ద ఉన్నటువంటి రిసార్ట్ రూములో తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. నలుగురికి ధైర్యం చెప్పాల్సిన ఎస్సై ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని మండల ప్రజలు అంటున్నారు. ఘటన స్థలానికి అధికారులు చేరుకున్నారు. ఎస్ఐ మృత్తికి గల కారణాలను పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది.
Post Views: 1,030